Sunday, January 24, 2021

The Individual belongs to Lord Krishna

Lord Krishna assures us in the Gita. He says: "The body belongs to mud. Hence it gets back into the mud. But the individual within the body belongs to me. The Jiva cannot find peace unless he merges within me. I keep changing the course of Jiva's life only to turn him towards me. I do it only for his good."

But the individual doesn't understand it'. What else do we need? The Lord Himself is saying: 'Individual belongs to Me'. So what is there for us to fear?

You are not the body

Sri Nannagaru asked a devotee - "How is your health?"
Devotee - "I am having hand pain"

Sri Nannagaru - "Do exercise. He continued saying, All the complaints you told are because of your attachment with the body. You are attached to the body quite a lot. If you have fear, it implies you don't have faith in God."

Devotee asked, "When faced with some difficult circumstances in the past, the (spiritual) subject helped me, but today when some disease attacked my body, I am getting disturbance".

He looked at the devotee and said - "If you are very healthy do you live for 1000 years? Serve food to the body, bath your body, take medicines, do your daily duties, and don't think about the body. If you are attached (in the mind) to the pains, be it leg pain or hand pain, you can’t overcome the body consciousness, and rebirth will be unavoidable.




Once, while traveling with Sri Nannagaru a devotee asked him, “Is the attachment to the body the root cause for all sorrows?

Sri Nannagaru replied – “Yes, but it is not as difficult as you think to get rid of this attachment. Suppose you wish to go to somebody's house, it is a thought, as you see it as a thought. Treat the body bound I also as a thought”

As you withdraw the body bound "I" as a thought, you can attain Jnana, right now here itself.”

Friday, January 22, 2021

"Aum Dakshinamurthaye Namaha" - (By Dr.Usha Garu)

I had been to Coimbatore to Nannagaru during the third year of college during which other devotees (from Hyderabad, Vizag & Bhimvaram) also came to spend a few days with him. All of us got accommodated in the same hotel as his. The days we stayed with him he would give discourses for almost 6-8 hours. Most times he would give discourses on Adwaita of Adi Shankaracharya. On one of those days after Nanna went to rest, we had a discussion among our devotees on those topics and contemplation of the same. In one of such discussions, I expressed the view that if only we experienced oneness or had complete faith that oneness is the Truth, we wouldn’t have so many distractions, wavering in the mind or confusion., for which one of the senior devotees expressed her understanding of the subject. She said since we are with the notion of having a body, when there is a hurt or wound on our arm, we apply ointment or take medication if the infection is more. Similarly, if we do sadhana to remove this false notion that I am this body, we shall gradually lose the wrong identification, that was indeed a beautiful way of presentation. Then we all agreed that sadhana is a necessity to get rid of the false identity.

That afternoon we hired a van to go to Dayananda Ashram with Nannagaru after his tea time. As per plan, we started our travel with him at noon. It was pleasant, beautiful & full of greenery on either side during our journey. So watching the beauty of nature and looking at Nanna who was seated in front beside the van driver, I started contemplating on the morning discussion that we had amongst devotees. The notion of body, body getting hurt or wounded, and taking medication to cure the same...why all this? Aren’t we healthy to start with? Why should we give scope for being infected! Isn’t all this an illusion?!

As Bhagavan sings in Aksharamanamala,

(108 hymns in praise of Arunachala)

When you are one and one alone., who is it that deludes you and appears apart? Is it not but your veil of illusion?!

Is there any existence apart from oneness? Can anything detach itself from you and have separate existence and entity? Whatever appears to have originated, isn’t that also a part of your Leela (Play). So when all is one, where is the scope of being separate or losing health or developing an infection? As I was enquiring in this manner, all of a sudden all that seemed separate disappeared and complete experience of oneness dawned upon me. In that experience, there wasn’t any duality., opposites or separateness. There was a flow of unalloyed happiness and peace and tears started flowing unaware. With tremendous gratitude, I looked at Nanna sitting in the front seat. The same time Nanna looked back at me and flashed a bright smile as if in approval of that state! I haven’t said a word to anyone nor anyone knows of my experience within. When God decides to bless you, he does so in silence without even the person next to you being aware of the same.

The state of complete peace and happiness is a true state and it remained for a long time. Tears flowed incessantly. It took a while to come back to body consciousness. After reaching Dayananda Ashram, Nannagaru first took us to Dakshinamurthy idol. All of us were watching from a distance.

Nannagaru asked me, “Do you know who this is? When I replied “Dakshinamurty!”, he said, “Yes, he is Daksinamurthy. He did not preach to Sanat kumaras through words. He imparted self-knowledge in silence, and in his very presence they attained the experience of True self”. I could relate it to my experience in the van in his presence without any words or speech. Nanna also said that Dakshinamurthy incarnated himself only for a short time (few minutes), unlike Rama and Krishna who were incarnations that came to destroy demons. He took incarnation for a few mins just to impart the knowledge in silence to his 4 disciples.

Though I had been listening to Nannagaru discourses for many years by then, that day what I have experienced was unique. Though I had experienced glimpses of truth on many occasions, this was the time Nanna gave more clarity with example. He said listening to True knowledge is one thing & experiencing it is something else. It happens in silence!

Thursday, January 21, 2021

"ఓం దక్షిణామూర్తయే నమః" - (By డా. ఉష గారు)

నేను తర్డ్ ఇయర్లో ఉండగా నాన్నగారి కోసం కోయంబత్తూరు వెళ్ళాను. అలా వెళ్ళినప్పుడు కొంతమంది భక్తులతో కలిసి హోటల్ రూమ్ లో ఉండటం జరిగింది. అక్కడ ఉన్నన్ని రోజులూ నాన్నగారు దాదాపు 6 - 8 గంటలు సజ్జక్ట్ బోధించేవారు. అందులో ఉదయంపూట ఎక్కువగా ఆచార్యులవారు, ఆయన జీవితం పొడవునా బోధించిన అద్వైతం గురించి చెప్పేవారు. ఆ బోధవిన్నాక ఒకరోజు భక్తుల మధ్య ఆధ్యాత్మిక చర్చ జరిగింది. అప్పుడు నేను ఉన్నది ఒక్కటే అని అనుభవంలోకి వచ్చేస్తే ఏమీ లేదు, ఈలోపు ఎంత గందరగోళం సృష్టించుకుంటామో కదా! అన్నాను. అలా కాదు ఉషా, ఇప్పుడు మనకు శరీరం ఉంది. శరీరం మీద గాయం అయింది. గాయంవల్ల మనకు బాధ కలుగుతుంది. గాయం పెద్దదయితే బాధ తొలగించుకోవటానికి మందువేస్తాం. అలాగే నేను అనే భావన రావడం వల్ల ఈశరీరం వచ్చింది. దానికి సాధన అనేమందు వేస్తే అనారోగ్యంలోంచి బయటకు వచ్చేస్తామని ఒక ఆవిడ చాలా అద్భుతంగా చెప్పారు. సాధనచేస్తేగాని ఈ ద్వంద్వంలోంచి బయటకు రాలేము కదా! అని మేమంతా చర్చించుకున్నాము.

ఆరోజు మధ్యాహ్నం నాన్నగారు లేచాకా, దయానంద ఆశ్రమానికి వెళ్ళడానికి వేను మాట్లాడుకుని నాన్నగారితోపాటు అందరం బయలుదేరాము. దారిపొడుగునా పచ్చగా ఉన్న ప్రకృతిని గమనిస్తూ, మధ్య మధ్యలో నాన్నగారివైపు చూస్తూ, ఉదయం సంభాషణలోని వాక్యాలు గుర్తు చేసుకుంటూ ఆలోచిస్తున్నాను. అసలు గాయం అవడం, అనారోగ్యం రావడం దానికి మళ్ళీ మందు వేసుకోవడం ఇదంతా ఎందుకు? అనారోగ్యం రాకముందు మనం ఆరోగ్యంగానే ఉన్నాం. అసలు ఆరోగ్యంగా ఉంటే అనారోగ్యం రావడానికి ఆస్కారమేలేదు కదా! అనారోగ్యమనేది కల్పితమే!

భగవాన్ అక్షరమణమాలలో చెప్పినట్లు:

ఒకడవౌ నిను మాయ మొనరించి వచ్చువా
రెవరిది నీజాల మరుణాచలా!

నినువీడి మాయ అంటూ ఒకటి రావడానికి ఆస్కారముందా? నీకు తెలియకుండా మాయ అనేది ఎక్కడనుంచి వచ్చింది? ఈ మాయ అనేది కూడా నీలీలలో భాగమే తప్ప దానికి భిన్నత్వం ఏముంది? ఉన్నది ఒక్కటే! దానికి గాయమేంటి? అనుకుంటూ ఆలోచిస్తుంటే, అకస్మాత్తుగా అంతా అదృశ్యమైపోయి ఉన్నది ఒక్కటే అన్న అనుభవం వచ్చేసింది. అక్కడ ఇంక ఆరోగ్యం లేదు, అనారోగ్యం లేదు, ద్వద్వం లేదు. హృదయంలోంచి ఆనందం పొంగుతూఉంటే ఆ అనుభవానికి కళ్ళమ్మట నీళ్ళు కారుతుంటే, నాన్నగారివైపు చూసాను. అప్పుడే నాన్నగారు కూడా వెనకకు తిరిగి నా వైపు చూసి అవును అని సూచిస్తున్నట్లుగా నవ్వారు. నేను పైకి ఏమీ మాట్లాడలేదు. నాలో ఏం జరుగుతోందో పక్కన ఉన్న వారికి తెలియలేదు. అంటే భగవంతుడు నిన్ను అనుగ్రహించేటప్పుడు, నీకు అనుభవం ఇవ్వాలనుకున్నప్పుడు, రెండోకంటికి తెలియకుండా నిశ్శబ్ధంగా ఇవ్వగలడు అనేదానికి అది ఋజువు.

అప్పుడు నేను ఈ అనుభవం మాత్రమే నిజం! ఇదే ఫైనల్ అనుకున్నాను. నాకు కళ్ళమ్మట నీళ్ళు కారుతూ ఉన్నాయి . ఆ అనుభూతి చాలాసేపు ఉండిపోయింది. లోపల ఆనందాన్ని అనుభవిస్తూ, మెల్లగా నన్ను నేను అదుపులోకి తెచ్చుకుంటూ మామూలు స్థితికి వచ్చాను. అందరం కలిసి దయానంద ఆశ్రమానికి వెళ్ళగానే, నాన్నగారు ముందుగా ఆశ్రమంలో ఉన్న దక్షిణామూర్తి విగ్రహం దగ్గరకు తీసుకువెళ్ళారు. మేమంతా దూరంగా నిలబడి చూస్తున్నాము.

ఉషా ఈయన ఎవరు? అని అడిగారు. దక్షిణామూర్తి నాన్నగారూ అన్నాను. దక్షిణామూర్తి అమ్మా సనత్ కుమారులకు నోరు విప్పి మాటలద్వారా బోధించలేదు. మౌనంలోనే బోధించారు. ఆయన సమక్షంలోనే అనుభవం రావడం కూడా జరిగింది అన్నారు. వెంటనే నాకు ఈరోజు వేన్ లో జరిగింది అదే కదా అనిపించింది. దక్షిణామూర్తిది కొన్ని నిముషాల అవతారమమ్మా! రాముడులాగ, కృష్ణుడిలాగ అవతారపురుషులులాగ రాలేదమ్మా ఆయన. జ్ఞానం తాలూకు అనుభవాన్ని ఇచ్చి అవతారం చాలించేసారు అన్నారు.

నాకు మనసులో నాన్నగారు చెప్పిన ప్రవచనాలు ఇన్నిరోజులూ వింటూ వచ్చాము కానీ, హృదయంలో కలిగిన అనుభవం చాలా ప్రత్యేకమయినది అనిపించింది. నాన్నగారి సమక్షంలో అప్పుడప్పుడూ ఆత్మస్థితి అనుభవంలోకి వచ్చినా కూడా ఈసారి నాన్నగారు దానికి చాలా స్పష్టతనిచ్చారు. మౌనంలోనే నీకు లోపల ఉన్న వస్తువు అందుతుంది. మాట ఒకఎత్తు అయితే, మౌనం ఒక ఎత్తు.

Sunday, January 17, 2021

Every deed should lead towards your liberation

Acharya said, "If you get any thought, ensure that it leads towards your liberation. If you speak something, ensure that it leads towards your liberation. Similarly, if you do something, ensure that it leads towards your liberation. Direct all your thoughts, words and deeds towards liberation because if the body expires without securing liberation, your life resembles zeroes on the right side without one on the left side ie it becomes valueless. Your intellect must be utilized towards securing liberation. If you make good utilization of God-given opportunities, though God doesn't bless you with liberation, He will ensure that in the next birth you are born in a family that aids in your liberation.



Purify your Mind

A swamy from Brazil asked Sri Nannagaru, “You say that we are not the mind, then why do you say that we need to purify it?

Sri Nannagaru said, “You are also saying the body is not you but then, why are you cleaning it daily? Likewise, though we're not the mind, we are identifying with it. So we need to purify it as that is the very hindrance to attain oneness”.


A devotee said, “Nannagaru, I don’t have any devotion; upon seeing you and coming to Arunachala, I felt I should lead a life with devotion. I have a lot of friends and bad habits. On reaching home, I am afraid that I might go back to my old friends and habits”

Sri Nannagaru replied – “Is your mind so weak? If you have a weak mind, you will go to your friends. If your mind is strong enough, your friends will come to you. A wise person will approach that, which is good for them. You are an intelligent person, and you will not go in wrong path”

Wednesday, January 13, 2021

"శ్రీ నాన్నగారి కటాక్ష వీక్షణాలు" - (By బంగారమ్మ గారు & లేట్ సూర్యకాంతమ్మ గారు (గుమ్ములూరు))

మాది గుమ్ములూరు గ్రామం. మా ఇంటి పక్కన మా వదిన గారు సూర్యకాంతమ్మ గారు ఉండేవారు. ఆవిడ కాపవరం లో నాన్నగారి ప్రవచనం విని నాతో ఇలా చెప్పారు. “బి. వి. ఎల్. ఎన్. రాజు గారు (నాన్నగారు) అని జిన్నూరు నుండి వచ్చి ప్రవచనం చెప్పారు చాలా బాగుంది” అన్నారు. ఈ సారి వెళ్ళినప్పుడు నేను మీ కూడా వస్తాను వదినా అని చెప్పాను. తరువాత ఇద్దరం కలిసి జిన్నూరు వెళ్ళాము. జిన్నూరులో నాన్నగారు ప్రతి ఆదివారం అరుగుమీద ప్రవచనం చెప్పేవారు. వదిన, నేను ఇద్దరం వెళ్ళేవాళ్ళం. తర్వాత పోస్ట్ ఆఫీస్ లో మొదలు పెట్టారు. మేము నాన్నగారిని మీ ప్రవచనాలు చాలా అద్భుతంగా ఉన్నాయి, మా గ్రామంలో కూడా పెట్టండి అని అడిగాము. సరే మీ గ్రామంలో సంవత్సరానికి మూడు సార్లు పెడతాము అని నాన్నగారు మాకు మాట ఇచ్చారు. అలా ఎనిమిది సంవత్సరాలు నాన్నగారి ప్రవచనాలు మా గ్రామంలో నిర్విరామంగా కొనసాగాయి.

సూర్యకాంతమ్మ గారి అరుగు చాలా పెద్దదిగా, పొడవుగా ఉండడంవల్ల, ప్రవచనాలు జరిగినప్పుడు ఆ అరుగుమీద భక్తులందరికి భోజనాల ఏర్పాట్లు చేసేవాళ్ళము. నాన్నగారు కూడా భక్తులతో పాటు కూర్చుని ఆ అరుగుమీద భోజనం చేసేవారు. నాన్నగారి మాటలు విన్నప్పుడల్లా మాకు అలౌకికమైన ఆనందం కలిగేది. తర్వాత డాక్టర్ రామారావు గారు నాన్నగారు దీపోత్సవానికి జ్యోతి వెలిగిద్దాం అన్నారు. అప్పుడు మేము ఒక పాత్రను చేయించి, ఒక కేజీ ఆవు నెయ్యితోపాటు ఒత్తు తయారు చేసి పట్టుకువెళ్ళాము. మిగతా భక్తులు కూడా ఆవునెయ్యి తీసుకువచ్చారు. అలా జిన్నూరులో దీపోత్సవం ప్రారంభమయింది. మేము ప్రసాదంగా రవ్వలడ్డు చేసుకుని వెళితే, నాన్నగారికి భక్తులు ఎక్కువ ఖర్చు పెట్టడం ఇష్టం ఉండదు కదా! “రవ్వ లడ్డు వద్దమ్మా పంచదార మిఠాయి చేయండి” అన్నారు. తరువాత సంవత్సరం నుండి పంచదార మిఠాయి చేసుకుని వెళ్ళేవాళ్ళం. తర్వాత భక్తులు పెరిగేకొద్దీ నాన్నగారు ప్రసాదం ఇంక మీరు ఆపేయండి, ఇక్కడ ఉప్మా చేయిద్దాం అని అలా ఉప్మా మొదలుపెట్టారు. “భగవాన్ ఫోటో వైపు ఎక్కువగా అలా చూస్తూ ఉండండి, ఎరుకతో ఉండాలి” అనేవారు. అలా ఎరుకతో ఉండటం మాకు తెలిసేది కాదు. ఒకసారి నాన్నగారు నాతో, “నామం చేస్తూ ఉంటే ఏ తలంపులు వస్తున్నాయో చూసుకొని, ఈ తలంపులు నాకు ఎందుకు వస్తున్నాయి? ఈ తలంపు నాకు రాకూడదు కదా! అనుకుంటూ నెమ్మదిగా వాటిని తీసి పడేయాలి. అలా చేస్తూ ఉంటే కొన్నాళ్లకు మౌనంగా ఉండటం అలవాటు అవుతుందమ్మా!" అన్నారు. ఆయన చెప్పిన మాటలను ఆచరణలో పెట్టుకోవటానికి ప్రయత్నిస్తూ ఉండేదాన్ని.

గుమ్ములూరులో తారకం గారు, వేమూరి సూర్యనారాయణ గారు అనే బ్రాహ్మణులు ఉండేవారు. వారు భగవాన్ భక్తులు. నాన్నగారు మమ్మల్ని అప్పుడప్పుడు వారి ఇంటికి వెళ్ళమనే వారు. తారకం గారు, నాన్నగారు మాట్లాడుకుంటుంటే వినటం నాకు చాలా ఇష్టంగా ఉండేది. ఒకసారి పాలకొల్లు బస్ స్టాండ్ కి వెళ్తే అక్కడ తారకం గారు, నాన్నగారు రోడ్డుమీద నిలబడి సబ్జెక్టు మాట్లాడుకుంటున్నారు. నేను కూడా వెళ్లి వారి వద్ద నిలబడి విన్నాను. అప్పుడు వారిద్దరూ గోపికలు గురించి మాట్లాడుకుంటున్నారు. నాన్నగారు "భక్తి అంటే గోపికల భక్తి లాగా ఉండాలి. వాళ్లకి కృష్ణుడు తప్ప ఇంకేమీ అక్కర్లేదు!" అని చెప్పారు. ఒకసారి ఆచంటలో నాన్నగారి ప్రవచనం జరిగింది. అక్కడ నాన్నగారిని ఒక ఫోటో తీశారు. ఆ ఫోటో మనం ఎటు వెళ్ళినా మన వైపే చూస్తున్నట్టు ఉంటుంది. డాక్టర్ రామారావు గారు ఆ ఫోటో కొనుక్కోండి అమ్మా అని చెప్పారు. ఆ ఫోటో కొనుక్కుని ఇంట్లో పెట్టుకున్నాను. “మీరు ఎలాగూ ఎప్పుడూ మా వైపు చూస్తూనే ఉంటారు, నా దృష్టి ఎల్లప్పుడు మీ వైపే ఉండేటట్లు అనుగ్రహించండి!” అని వేడుకొనేదాన్ని.

ఏ పని చేసినా నేను కాదు చేసేది, ఆ భగవానే చేస్తున్నాడు అని అనుకోమనే వారు. అక్కడ నీవు లేవు అని నాన్నగారు చెప్పేవారు.

మా అబ్బాయి వికలాంగుడు, మాటలు రావు. తన సొంత పనులు కూడా తను చేసుకోలేడు. కానీ తనకు అన్నీ అర్థం అవుతాయి. మీటింగ్ కి వెళ్లేటప్పుడు వాడికి ఒక గిన్నెలో కూర అన్నం, ఒక గిన్నెలో పెరుగు అన్నం కలిపి అక్కడ పెట్టి వెళ్ళేదాన్ని. వాడు తినేవాడు. నాకు వివాహం అయిన మూడు నెలలకే నా భర్తకి మానసికంగా తేడా వచ్చింది. ఆయనను కూడా ఒక చిన్న పిల్లాడిని చూసుకున్నట్టు చూసుకోవాల్సి వచ్చేది. వాళ్ళిద్దరికీ నేను సేవ చేస్తున్నాను అనే భావన లేకుండా వారిద్దరిని చూసుకునేలా నాన్నగారు నన్ను అనుగ్రహించారు. ఒకసారి నాన్నగారు “బంగారమ్మ గారూ! మీకు ఏ సాధన అవసరం లేదు. వారి ఇరువురిని చూసుకోండి సరిపోతుంది" అన్నారు. అలాగే చూసుకునే శక్తి కుడా ఆయనే ఇచ్చారు.

నాకు కారం అంటే చాలా ఇష్టం. నాన్నగారు ఎక్కువ కారం తినకూడదు అని చెప్పేవారు. ఒకసారి భగవాన్ దగ్గర కూర్చుని, నాన్నగారు కారం ఎక్కువ తినకూడదు అంటున్నారు. నేనేమో కారం మానలేను అని వేడుకున్నాను. అంతే ఆ తర్వాత నుండి కారం తింటే గొంతులోమంట వచ్చేది. నాన్నగారు కాఫీ ఎక్కువ వేడిగా తాగవద్దు బంగారమ్మ గారూ అంతమంచిది కాదు అనేవారు. నాకేమో వేడి అంటే ఇష్టం. నాన్నగారు అలా చెప్పాక వేడి కాఫీ తాగితే నాలిక తిమ్మిరి వచ్చేసేది. తండ్రి నా మీద నీ కృప ఇలా చూపించావా అనుకున్నాను. ఇక ఆయన మాటే పట్టుకొని ఆయన ఎలా జీవించాలి అంటే అలా జీవించటానికి ప్రయత్నం చేసే వాళ్ళం.

నేనెప్పుడూ నాన్నగారితో మా అబ్బాయి గురించి గానీ, నా భర్త ఆరోగ్యం గురించి గానీ చెప్పే దాన్ని కాదు. నాన్నగారు ఎప్పుడు గుమ్ములూరు వచ్చినా మా అబ్బాయి ఆయన కూడా తిరిగేవాడు. మా అబ్బాయి రోడ్లమీద తిరుగుతూ శుభ్రంగా ఉండేవాడు కాదు. అందుకని నాన్నగారి వెనకే నువ్వు వెళ్ళవద్దు అనేదాన్ని. అయినా అగేవాడు కాదు. నాన్నగారు చేత్తో ఆశీర్వదించే వరకూ ఆయన వెనకే తిరిగే వాడు. ఆయన ఆశీర్వదించిన తరువాత వెళ్ళిపోయేవాడు.

మా వదిన గారు అయిన సూర్యకాంతమ్మ గారి అనుభవాలు నా జ్ఞాపకాలలో:

సూర్యకాంతమ్మ గారికి చిన్న వయస్సు నుండి ఆధ్యాత్మిక చింతన ఎక్కువే. ఆమె చిన్న వయసులోనే భర్త పోతే, కుంటుంబ భారం అంతా మోస్తూ కూడా ఆధ్యాత్మిక చింతనని విడిచిపెట్టలేదు. ఎందరో గురువులు దగ్గరకు వెళ్లి ఎన్నో ప్రశ్నలు వేసేవారు. వారు చెప్పిన సమాధానాలు ఆమెకి సంతృప్తిని ఇచ్చేవి కావు. ఒకసారి స్వప్నంలో తెల్లని వస్త్రం ధరించిన ఆకారం ఒకటి ఆమెకి కనిపించింది. ఆ తరువాత త్వరలోనే ఆమెకి ఉన్న సంశయాలను తొలగించేవారిని కలుస్తాను అని అనిపించిందట.

కొద్ది రోజులకి ఆమె పుట్టపర్తి బాబా గారి దర్శనానికి వెళ్లారు. బాబాగారు అటుగా వస్తుంటే ఆమె మనస్సులో తండ్రీ, ప్రతిసారి ఇంత దూరం మేము రాలేము. మా పరిస్థితులు మీకు తెలియనవి కావు అని అనుకున్నారట. బాబా గారు ఒక్క క్షణం ఆగి బాధపడకండి త్వరలో మీ దగ్గరకి వచ్చి బోధ చెపుతారు అన్నారట. బాబా గారు ఇంతదూరం ఎలా వస్తారు? అనుకొని ఇంటికి వచ్చేశారు. ఆ తరువాత 1979 వ సంవత్సరం కాపవరంలో గీతాజయంతికి మొదటిసారి నాన్నగారి ప్రవచనం విన్నారు. నాన్నగారిని చూడగానే ఏదో తెలియని ఆనందం కలిగింది అన్నారు. ఆ ప్రవచనంలో ఆమె మదిలో మెదిలే ప్రశ్నలకు సమాధానాలు లభించాయి.

భగవాన్ శ్రీ రమణ మహర్షి అంటే ఇది వరకు నాకు తెలియదు. నాన్నగారు లాంటి జ్ఞాని జిన్నూరు గ్రామంలో మనకు దగ్గరగా ఉన్నా కూడా తెలియలేదు. 1979 నవంబరు నెలలో "గీతా జయంతి" కి కాపవరంలో మా బంధువులు అయిన కాపవరం సూర్యనారాయణ రాజు గారు నాన్నగారి ఉపన్యాసం ఉంది అని కబురు చేశారు. కాపవరం వెళ్లినందుకు నాన్నగారి దర్శనం అయింది. నిరాడంబరంగా ఉన్న నాన్నగారిని చూస్తే నా మనసుకి ఆనందం కలిగింది. ఉపన్యాసం విన్నాక నాన్న గారిని మా గ్రామం రమ్మని అడగాలనిపించింది. మా గ్రామంలో కూడా ఒక పదిమంది ఇలాంటి మంచి మాటలు వింటారు కదా! ఇటువంటి మాటలు చెప్పమంటే ఎవరు చెప్పగలరు? అది నాన్నగారికి మాత్రమే సాధ్యమవుతుంది అనుకొని 27/1/1981వ తారీకున గుమ్మలూరు రమ్మని ఆహ్వానిస్తే నాన్నగారు వచ్చారు. ఆ రోజు సభను చూసి ఆయన ఎంతో సంతోషించారు. గుమ్మలూరులో అందరు నెమ్మదిగా అర్థం చేసుకుంటారు, చాలా శ్రద్ధగా విన్నారు అని నాన్నగారు అన్నారు. తర్వాత ఎనిమిది సంవత్సరాలు మా గ్రామం వచ్చారు. మనం చెప్పుకోవలసినది ఏమంటే, నాన్నగారు భగవాన్ ద్వారా పొందిన ఆత్మానుభూతిని అనుభవపూర్వకంగా మన అందరికీ అందిస్తున్నారు. నాన్నగారు చెప్పిన మాటలు విని, విచారణ చేసి ఆచరించినట్లయితే జనన మరణ చక్రంలోంచి మనం విడుదల అవుతాము. నాన్నగారు అంటే ఎవరో కాదు రమణుడే. ఆయన సమక్షంలో ఉన్నప్పుడు మన మనసుని నాన్నగారు తప్పమరెవరూ అంతర్ముఖం చేయలేరు అనిపించేది. మనకు ఇంత దగ్గరలో ఇటువంటి మహా జ్ఞాన స్వరూపుడు అయిన నాన్నగారు దొరకడం ఎన్ని జన్మల సుకృతమో చెప్పటానికి సరిపోము. నాన్నగారు చెప్పిన మాటలు విన్నాక నాలో మారు మనసు కలుగుతూ వచ్చింది.

ఒకరోజు పాలకొల్లు ఉష గారు, నేను కలిసి నాన్నగారి దగ్గరకు వెళ్ళాము. శ్రీరమణ అనుగ్రహం వలన ఆ రోజు నాకు చాలా సుదినము. ఎందుకంటే ఒక మహత్తరమైన అనుభవం శ్రీ నాన్నగారి కటాక్ష వీక్షణాలు వలన నాకు లభ్యమై నా జీవితం ధన్యమైంది. ఆ అనుభవాన్ని నేను మాటలతో వర్ణించి చెప్పలేను. అసలు కళ్ళు విప్పి చూడాలని గాని, వినాలని కానీ లేని స్థితి నాకు కలిగింది. ఆ సహజ స్థితిలోనే ఉండిపోవాలని అనిపించింది. ఆసమయంలో కాసేపు నవ్వాలని, కాసేపు ఏడవాలని అనిపించింది. అంత ఆనందంగా ఉంది. ఇది అంతా కూడా పాలకొల్లు ఉష గారు వచ్చి జిన్నూరు రమ్మనడం వలన జరిగింది. అందుచేత ఆమెకు నా కృతజ్ఞతలు అని చెప్పారు. ఇక ఆ రోజు నుండి మా వదినగారు దేహం వదిలేవరకు నాన్నగారే ఆమెకి సర్వం అయ్యారు. అంతేకాకుండా ఆమెద్వారా ఎంతోమంది నాన్నగారి భక్తులు అయ్యారు.

Sunday, January 10, 2021

"The path of Love" - (By Dr.Usha Garu)

In his presence mind turns calm, peace pervades our being, heart rejoices & silence engulfs. At times it feels like we don’t require anything except Nanna’s presence. The love, mercy, compassion flowing from those beautiful eyes, the most charming smile, the profoundness of his words, his utmost simplicity, tenderness of heart, magnanimity in his stature, after seeing it all manifested in one, can we be drawn to any other in this world ever!

As far as my visions of Nanna were concerned they felt more real than reality itself (and not like dreams). One such vision I had during my hostel days took place in the strict atmosphere of ladies hostel where no one was allowed into the premises except for the tenants, the main gate was kept open and a car had come inside. Nannagaru along with Rama Chandra Raju Garu got down from it. There was a huge ground beside our hostel which was filled with more than 1500 devotees. Wondering how all of them had come inside, rushed into a nearby room and got a chair for Nanna for him to be seated. Nanna quietly sat on the chair, surrounded by devotees.

At that time a devotee of Nanna brought a huge basket of bananas and gifted to Nanna. Nanna called me and told me to distribute one banana to each devotee. Since they would not be enough for all, I asked him if I should cut them into small pieces and distribute. He said that is not required and that all shall receive the fruit. He told me to distribute without hesitation and I did so. To my surprise, all got the bananas as told by him.

Finally, the last lady I came across, was old, sick, helpless, coughing severely and was in immense suffering. She couldn’t take the fruit. When I told Nanna that she was shivering and unable to accept the fruit, he told me to peel it and give it to her. Her cough increased and she couldn’t accept the peeled banana too. When I looked at Nanna helplessly, he got up from his chair & came to us. He took the fruit from my hand, pressed both her cheeks with one hand (in order to keep her mouth open), with the other hand, stuffed the banana into her mouth & closed her mouth with his hand so that she gulps it instantly. The moment she swallowed it she lost all sickness and suffering, she wasn’t old anymore. She was radiating with good health. All of us were spellbound by this incident and I was looking at him with awe when my vision broke and I woke up.

In a few days after that, I made one of my regular visits to Thiruvannamalai, when I was going around Bhagavan’s samadhi, one of Nanna devotees happened to see me and with excitement held my hand, pulled me out with her to the outside of the Ashram, as she wanted to share something really important. When I walked out with her, she narrated what Nanna spoke in one of his recent speeches in Andhra Pradesh (saying she had to share it with me as I was a university student and couldn’t attend to all his speeches).

He said, ‘Many enlightened saints came to this planet earth and imparted the spiritual truth by various methods. For example, Ramakrishna’s was the path of devotion, Bhagavan Ramana’s was the path of Jnana, Buddha’s was of Dhyana (meditation), Yogananda’s was that of yoga, then he asked devotees which path is ours? When devotees were eagerly waiting to listen to his answer, he replied, “Ours is the path of love. Bestowing all with self-realization”. Again he asked, what is bestowing it with love? For which devotees were amused and waited again to listen to his reply. Then Nanna replied saying, “As a newborn calf that can’t drink milk from its mother’s udder, it is forcefully given milk by inserting a pipe wherein the calf is forced to drink though unable to do so by itself. Similarly though not ripe or fit to realize the Truth, it will be imparted to all with immense unconditional love! Saying that she asked me if there can be any Guru like this with such tremendous divine love?!

After hearing what she said, I realized my vision & his words had so much co-incidence. The impurities in the mind & the body bound ‘I’ are the root cause of all suffering, because of which we are unable to comprehend the Truth. Our suffering can’t be removed by mere human effort, it can be eradicated in his immense unconditional love, like the calf being made to drink the milk though not able to drink by itself. He imparts the knowledge, gives an understanding of the same & makes us experience the true state in his presence. This he does with tremendous compassion so that there is no pain, struggle & disappointment to the seeker. I understood that the devotees that take refuge in him & seek earnestly, are blessed with the experience of Truth by his Grace alone! (Like he eradicated the sickness of the woman in the vision by forcing a fruit though unable to swallow it herself)

By being in his divine presence (the indweller) we are completely taken care of, our lives get blessed. For the one who surrenders completely to him, Without much effort on our part, without hurdles or difficulties, we can fearlessly cross all barriers & realize the Truth in his All-encompassing grace & love!

"ప్రేమ మార్గం" - (By డా.ఉష గారు)

ఆయన సమక్షంలో మనస్సు నిర్మలమవుతుంది. శాంతి ఆవరిస్తుంది. హృదయం స్పందిస్తుంది. మౌనం ప్రకాశిస్తుంది. ఒకొక్కసారి అనిపిస్తుంది జ్ఞానం పక్కన పెడదాం. ఈ జన్మకు నాన్న చాలు. ఆ అందమైన కళ్ళల్లో నుంచి వ్యక్తమయే ప్రేమ, దయ, కరుణ, ఆయన నవ్వులో వున్నా ఆహ్లాదం, ఆయన పలుకులో ఉన్న ఔన్నత్యం, ఆయన నిరాడంబరత, నిర్మలహృదయం, ఆయన లో ఉన్న గంబీరత్వం చూసి ఈ జీవుడికి సృష్టిలో ఏదైనా ఆకర్షణగా కనబడగలదా అనిపిస్తుంది.

నాన్నగారికి సంబంధించి నాకు వచ్చిన స్వప్నాలు జరుగుతున్న వాస్తవాల్లా ఉండేవి. ఒకసారి వచ్చిన స్వప్నం ఏమిటంటే, లేడీస్ హాస్టల్ లో బయటివాళ్ళని ఎవరినీ లోపలికి రానివ్వకపోయినా, హాస్టల్ గేట్ తెరుచుకుని ఒకకారు లోపలికి వచ్చింది. ఆ కారులో నుంచి నాన్నగారు, రామచంద్రరాజు గారు దిగారు. ఆ హాస్టల్ ఎదురుగా పెద్ద గ్రౌండ్ ఉంది. ఆ గ్రౌడ్ లో చూస్తే భక్తులు 1500 మంది పైగా కూర్చుని ఉన్నారు. హాస్టల్ లోకి భక్తులు ఎలా వచ్చారా? అని ఆశ్చర్యంగా చూస్తూనే, నాన్నగారికి రూములోనుండి ఒకకుర్చీ తెచ్చివేస్తే దానిలో కూర్చున్నారు. హాస్టల్ ప్రాంగణం అంతా భక్తులతో నిండిపోయి ఉంది.

ఆ సమయంలో ఒక భక్తుడు, పెద్దబుట్టతో అరటిపళ్ళు తీసుకువచ్చి నాన్నగారికి ఇచ్చాడు. నాన్నగారు ఉషా ఇలారా అని పిలిచి ఈ పళ్ళు అందరికీ పంచిపెట్టు అన్నారు. నాన్నగారూ ఈ పళ్ళు కొన్నే ఉన్నాయి కదా! అందరికీ సరిపోవు. చిన్నముక్కలు చేసి అందరికీ పంచమంటారా? అని అడిగాను. అవసరంలేదు అందరికీ ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ వెళ్ళిపో అన్నారు. అయితే అక్కడున్న అందరికీ లోటురాకుండా అరటిపళ్ళు సరిపోయాయి.

భక్తులలో కూర్చున్న ఒక వృద్ధురాలికి అరటిపండు ఇచ్చినప్పుడు మాత్రం ఆవిడ తీసుకోలేకపోయారు. అనారోగ్యంతో దగ్గుతూ, ఒణికిపోతున్నారు. నాన్నగారూ ఆవిడ తీసుకోలేకపోతున్నారు అని చెప్పాను. తొక్క ఒలిచి పెట్టమ్మా అన్నారు. ఆవిడ దగ్గు ఎక్కువయి దానిని కూడా తీసుకోలేకపోయారు. నేనేం చేయాలా అని నాన్నగారివైపు చూస్తున్నాను. నాన్నగారు కుర్చీలోంచి లేచివచ్చి ఏది ఇలా ఇవ్వు అంటూ నా చేతిలో పండు తీసుకుని, ఆవిడ బుగ్గలు నొక్కి నోరుతెరుచుకునేలా చేసారు. నోరు తెరవగానే అమాంతంగా నోట్లోపెట్టి, ఆయన చేతిని ఆవిడనోటికి అడ్డుగా ఉంచి నోరుమూసి గుటకవేసేలా చేసారు. ఆవిడ ఆ పండు మింగగానే అనారోగ్యం తాలూకు చాయకూడా లేకుండా, ముసలిరూపం పోయి పూర్తిఆరోగ్యంగా తయారయ్యారు. అక్కడున్న అందరం జరిగినదంతా ఆశ్చర్యంగా చూస్తున్నాము. దానితో కలచెదిరి నాకు మెలుకువ వచ్చింది.

ఆ తరువాత కొద్ది రోజులకి అరుణాచలం వెళ్ళాను. అక్కడ భగవాన్ సమాధి చుట్టూ ప్రదక్షిణ చేస్తూఉంటే, ఇదివరకులాగే మళ్ళీ ఒక భక్తురాలు నా చేయిపట్టుకుని మీతో ఒకసారి మాట్లాడాలి అంటూ బయటకు తీసుకువచ్చారు. ఈ మధ్య నాన్నగారి మీటింగ్ ఒకటి జరిగింది. మీరు కాలేజ్ లో ఉండడంవల్ల మీటింగ్ లకు రాలేరు కదా! అందుకని నాన్నగారు ఆ మీటింగ్ లో చెప్పిన అద్భుతమైన మాటలు మీకు చెప్పాలనిపించి బయటకు పిలిచాను. నాన్నగారు ఏం చెప్పారంటే, భూమిమీదకు వచ్చిన జ్ఞానులందరూ కూడా ఒక్కొక్కరూ ఒక్కొక్కమార్గాన్ని సూచించారు. వారిలో రామకృష్ణుడిది భక్తిమార్గం అయితే, భగవాన్ ది జ్ఞానమార్గం. బుద్ధుడిది ధ్యానమార్గం. యోగానందగారిది యోగమార్గం. మరి మనది ఏ మార్గం? అని నాన్నగారు అడిగారు. భక్తులు మాట్లాడకుండా నాన్నగారు ఏం చెప్తారా ? అని చూస్తున్నారు. అప్పుడు నాన్నగారు మనది ప్రేమమార్గం. ప్రేమతో ఇచ్చేయడమే అన్నారు. ఆయనే మళ్ళీ ప్రేమతో ఇచ్చేయడమంటే ఏమిటి? అన్నారు. ఎవరూ ఏమీ మాట్లాడకుండా చూస్తుంటే నాన్నగారు, ఒక ఆవుకి దూడ పుట్టినప్పుడు ఆవుదగ్గర పాలు తాగలేకపోతే, దానినోటిలో గొట్టంపెట్టి కడుపులోకి వెళ్ళిపోయేలా పోస్తారు. అలా మీకు అర్హత ఉందా? లేదా ? అన్నదానితో సంబంధం లేకుండా ప్రేమతో మీ అందరికీ ఇచ్చేయడమే మాపని అని చెప్పారు. ఇదంతా చెప్పి ఆవిడ, అసలు ఏ గరువు చెబుతారమ్మా ఇలాగ ? అన్నారు.

ఆ మాటలు విన్నాకా నాకు వచ్చిన కలకూ, నాన్నగారు చెప్పిన మాటలకూ సమన్వయం ఉందని అర్థమయింది. మన మానసిక అనారోగ్యం ఏదయితే ఉందో, ఏ అహంకారం వలన మనం జ్ఞానం పొందలేకపోతున్నామో, ఆ జ్ఞానాన్ని మనతో మింగించి మనల్ని ఆత్మ స్వరూపుల్ని చేస్తారు. అది ఆయన ప్రేమతోనూ, దయతోనూ చేస్తారు. అంతా నేనే చేస్తాను అని ఋజువు చేస్తున్నట్లు, వారం తిరగకుండానే నాకు వచ్చిన కలని ఆవిడతో నిర్థారణగా చెప్పించారు.

కేవలం ఆయన సమక్షంలో ( అంతర్యామికి సమీపంలో ) ఉంటే, ఆయన అన్నిరకాలుగా మనల్ని చూసుకుంటూనే మన జన్మ ధన్యమయ్యేలా చేస్తారు. మనం శరణాగతి చెంది అయన ధ్యాశలో ఉంటే, సాధన పేరుతో మనం ఏదో చెయ్యాలని తాపత్రయపడకుండా, భయపడకుండా, నిరాశపడకుండా ఉంటే మన ప్రయత్నంతో నిమిత్తం లేకుండా మోక్షం ఇచ్చి తీరతారనే విశ్వాసం నాలో దృఢపడింది.

Sunday, January 3, 2021

"షణ్ముఖుడే మన నాన్నగారు" - (By సౌగంధికా గారు)

మా చిన్నతనం నుండి మా ఇంటిలో అందరూ బాబాని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళం. ప్రతిరోజు క్రమం తప్పకుండా సాయి చరిత్రలో కనీసం ఒక్క అధ్యాయమైనా చదువుకునేవాళ్ళం. బాబాని నాకు నీ లాంటి గురువుని చూపించు బాబా అని ప్రార్థిస్తూ ఉండేదాన్ని. ఒకసారి బాబా స్వప్నంలో కనిపించి నీకు ఆరు ముఖములు కలవాడు గురువుగా వస్తాడు అని చెప్పారు.

మేము ఒక స్వామీజీ దగ్గరకు వెళుతూ ఉండేవాళ్ళం. అక్కడ నాకు ఒక భక్తురాలితో అనుబంధం ఏర్పడింది. ఆమె నాన్నగారి భక్తురాలు. ఆమె ఒక రోజు ఫోన్ చేసి మా అమ్మాయి ఇంట్లో నాన్నగారి సత్సంగం ఏర్పాటు చేసుకుంటున్నాము మీరు రండి అని ఆహ్వానించారు. నాకు అప్పట్లో అంతగా ఇష్టం లేకపోయినా, మొదటిసారి అయిష్టంగానే ఆ సత్సంగానికి వెళ్ళాను. మొదటిసారి భగవాన్ ఫోటో చూసినప్పుడు నాకు అంత ఎట్రాక్షన్ గా అనిపించలేదు. కానీ ఇప్పుడు ఏమనిపిస్తుందంటే, వారు ఆ రోజు సత్సంగానికి రమ్మని పిలిచినప్పటకి నేను వెళ్లకపోతే ఇంతటి మహానుభావుడు దర్శనభాగ్యం లభించక నా జీవితం వృధా అయ్యేది అనుకుంటూ ఉంటాను. నాకు బాబా అంటే ఇష్టం వలన గురువారాన్ని చాలా ప్రత్యేకమైన రోజుగా భావించేదాన్ని.ఆ రోజే నాన్నగారిని నేను మొట్టమొదటిసారిగా సావిత్రమ్మ గారి ఇంట్లో దర్శనం చేసుకున్నాను. నాన్నగారిని చూడగానే "He is none other than Shirdi Sai Baba" అనిపించింది. అదే రోజు అక్కడ ఉన్న ఒక భక్తురాలు నాన్నగారితో నాకు నామం ఇప్పించారు. నాన్నగారు నన్ను “నీకు ఏ దేవుడు ఇష్టం” అని అడిగారు. షిరిడి సాయిబాబా నాన్నగారు అని చెప్పాను. "ఓం శ్రీ సాయిరాం" అని మూడు సార్లు ఆయన చెబుతూ నాతో చెప్పించి ఈ నామము నీ నాలుక మీద కాపురం ఉండాలమ్మా అన్నారు.

ఒకసారి మాకు సత్సంగం చెప్పే టీచరు మీకు ఏమైనా సందేహాలు ఉంటే నాన్నగారిని అడగవచ్చు అన్నారు. నాన్నగారు మధురానగర్ వచ్చినప్పుడు నాకు సారం అర్థమైంది నాన్నగారూ! అది అనుభవంలోకి రావటానికి మీరు సహాయం చేయండి అని నాన్నగారిని అడుగుదామని ఇంటిదగ్గర అనుకొని మధురానగర్ వెళ్ళాను. అక్కడ నాన్నగారి చైర్ కి ఎదురుగా కూర్చున్నాను. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసాను చాలా మంది భక్తులు ఉండటంవలన నాన్నగారు వచ్చి కూర్చున్నా నేను అనుకున్న ప్రశ్న అడగకూడదు అనుకున్నాను. నాన్నగారు భాషణలు అనే పుస్తకం తీసుకు వచ్చి నా పక్కన కూర్చున్న ఒక భక్తురాలుకి ఇచ్చి నేను ఏ ప్రశ్న అయితే ఇంటిదగ్గర నాన్నగారిని అడుగుదామనుకున్నానో అదే ప్రశ్న చదవమని చెప్పారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నేను ఏదైతే అడగాలనుకుంటున్నానో అదే నాన్నగారు చెబుతున్నారు అని.

నాకు అరుణాచలం వెళ్ళాలి అని చాలా ఇష్టంగా ఉండేది. కానీ ఇంట్లో అంతగా ఇష్టపడేవారు కాదు. ఒకసారి మా Husband అరుణాచలానికి టికెట్టు కొని ఇచ్చి ఇదే మొదటిసారి, ఆఖరిసారి అరుణాచలం వెళ్ళటానికి అని చెప్పి అరుణాచలం పంపించారు. చాలా ఆనందం వేసింది. అప్పట్లో అరుణాచలం వెళ్ళినప్పుడు నాన్నగారికి ముందుగా చెప్పేవాళ్ళం. అలా నేను ఫోన్ చేసినప్పుడు నాన్నగారు తుని దీపోత్సవానికి వెళ్ళారని తెలిసింది. ఉష కూడా వెళ్ళారు అని తెలిసి ఉషకి ఫోన్ చేసి నాన్నగారికి నేను మొదటిసారి అరుణాచలం వస్తున్నాను అని చెప్పమ్మ అన్నాను. అలాగే చెబుతాను ఆంటీ అన్నారు. తరువాత ఉష నాకు ఫోన్ చేసి, నాన్నగారు కొంచెం బిజీగా ఉండటం వలన గదిలోకి వెళ్ళి పోతుంటే ఆఖరి నిమిషంలో చెప్పవలసి వచ్చింది అని చెప్పారు. నాన్నగారు విని ఉండకపోవచ్చు అనుకున్నాను. ఆంధ్రఆశ్రమంలో మెట్ల దగ్గర నాన్నగారు నన్ను చూసి ఎప్పుడు వచ్చావమ్మ సౌగంధికా? అని అడిగి నువ్వు మొదటిసారి అరుణాచలం వస్తున్నావు అని నాకు ఎవరో చెప్పారమ్మ అన్నారు. అంటే ఉష చెప్పింది నాన్నగారు విన లేదేమో అని నేను సందేహపడ్డాను కదా! ఆ సందేహాన్ని తొలగించారు. నాన్నగారు నువ్వు ఎన్ని రోజులు ఉంటావమ్మా అని అడిగారు. రెండు రోజులే ఉంటాను నాన్నగారూ, దీనికి కూడా మా ఇంట్లో అంగీకరించలేదు అతికష్టం మీద వచ్చాను. మా Husband తో మీరు చెప్పండి నాన్నగారూ నన్ను అరుణాచలం పంపించమని అన్నాను. అలాగేనమ్మా సంవత్సరానికి రెండు సార్లు నిన్ను అరుణాచలం పంపించమని అడుగుతాను అన్నారు. నాన్నగారు అలా అనగానే నాకు చాలా ఆనందం అనిపించింది.

తరువాత అరుణాచలేశ్వరుడి పెద్ద గుడికి వెళ్ళాము. అక్కడ అరుణాచలేశ్వరుడి మెడలో ఉన్న మాలని తీసి నాన్నగారి మెడలో వేసారు. నాన్నగారు ఆ మాల తీసి నా చేతికి ఇచ్చి అక్కడ ఉన్న విగ్రహాల చుట్టూ తిరుగుతూ సుబ్రహ్మణ్యేశ్వరుడు విగ్రహం ఎదురుగా నిలబడి చూస్తున్నారు. నేను నాన్నగారి పక్కనే ఉన్నాను. ఇదేంటి? నాన్నగారు అందరి దేవుళ్ళకు నమస్కారం పెట్టి సుబ్రహ్మణ్యేశ్వరుడుకి నమస్కారం పెట్టకుండా అలా నిలబడి చూస్తున్నారు ఏమిటి? అని మనసులో అనుకుంటున్నాను. ఈలోపు నాన్నగారు అమ్మా సౌగంధికా! నాకు అందరికీ నమస్కారం పెట్టాలనిపిస్తుంది కానీ ఈయనకు పెట్టాలి అనిపించదు. మనకు మనం ఏమి పెట్టుకుంటాము అనిపిస్తుంది అన్నారు. అయితే నాన్నగారు సుబ్రహ్మణ్యుడు అని మనసులో అనుకుంటూ ఉంటే ఈ లోపు "ఈయనను షణ్ముఖుడు అంటారు. అంటే ఆరు ముఖములు కలవాడు" అని చెప్పారు. అప్పుడు నాకు బాబా స్వప్న దర్శనం గుర్తుకువచ్చింది. అంటే బాబా సుబ్రహ్మణ్యేశ్వరుడు గురువుగా లభిస్తాడు అని చెప్పారు. ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడే నాన్నగారి రూపంలో వచ్చారు అనుకొని, అయితే నాన్నగారిని బాబాయే పంపించారు అని అర్థమై నా హృదయ ద్వారాలు తెరుచుకుని, ఆ రోజు నుండి అందులో నాన్నగారు స్థిరపడిపోయారు. తరువాత నేను హైదరాబాద్ కి చేరాక మా husband ఎలా జరిగింది trip? అని అడిగారు. బాగా జరిగింది, చాల సంతోషంగా ఉంది అన్నాను. అపుడు మా husband, నీకు అంత ఆనందంగా ఉంది కాబట్టి సంవత్సరానికి రెండు సార్లు అరుణాచలం పంపిస్తాను అన్నారు. నాకు నాన్నగారు చెప్పిన వాక్యాలు గుర్తుకొచ్చాయి, గురువు వర్క్ అంటే ఇది కదా అనిపించింది.

ఒకసారి ఎస్ ఆర్ నగర్ లో నాన్నగారు జిన్నూరులో జరిగిన ఒక సంఘటన చెబుతూ ఈ విధంగా వివరించారు. ఒక భార్య,భర్తలు నా వద్దకు వచ్చి నా భార్యకు బిపి వచ్చింది నాన్నగారూ, జీవితాంతం తనకి బీపీ టాబ్లెట్స్ కొనే స్థోమత నాకు లేదు. అందుకని హోమియోపతి కి వెళ్ళాలి అనుకుంటున్నాను అని అన్నారు. హోమియోపతి వాడినా మీరు ఒక నెల, రెండు నెలల వరకు ఇంగ్లీష్ మెడిసిన్ కూడా వాడండి అని చెప్పారు కానీ ఆయన వాడలేదు. అలా వాడని కారణంగా ఆయన భార్య మరణించారు. ఎవరైతే ఏడు రోజులు వరుసగా బీపీ టాబ్లెట్ మానేస్తారో వారు చనిపోతారు అని చెప్పి నా వైపు చూస్తున్నారు. ఏంటి నాన్నగారు నా వైపు చూస్తున్నారు? నాకు ఏమీ బీపీ లేదు కదా అనుకొని, ఎవరో ఒకరి వంక చూసి చెప్పాలి కదా! అలా చూసి ఉంటారు అని సరిపెట్టుకున్నాను. అదే రోజు మధ్యాహ్నం మరలా వెళ్ళాము. నాకు కొంచెం ఆలస్యం అవ్వటం వలన గేటు దగ్గర నిలబడి ఉన్నాను. నాన్నగారు పొద్దున జరిగిన సంఘటనే మరలా చెబుతూ ఎవరైతే బీపీ టాబ్లెట్ వరుసగా ఏడు రోజులు వేసుకోరో వారు చనిపోతారు అని పెద్ద, పెద్ద కళ్ళతో నా వైపు సీరియస్ గా చూసి చెబుతున్నారు. ఏంటీ మళ్ళీ నా వైపే చూసి చెబుతున్నారు? ఏదో తేడాగా ఉంది అనుకున్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత మా Husbandని మీరు బీపీ టాబ్లెట్ వేసుకున్నారా? అని అడిగాను. ఆరు రోజుల నుండి వేసుకోవటం లేదు అని సమాధానం చెప్పారు. వెంటనే నాన్నగారు మాట గుర్తుకు వచ్చి అర్జెంటుగా వెళ్ళి బీపీ టాబ్లెట్ తెచ్చుకుని వేసుకోమని చెప్పాను. అలా ఆ రోజు సాయంత్రం ఆయన బీపీ టాబ్లెట్ వేసుకున్నారు. నాన్నగారు ఈ విధంగా పరోక్షంగా నాకు చెప్పి మా Husband ని రక్షించారు అనిపించింది.

నాది ముక్కుసూటి మనస్తత్వం. అబద్ధం చెప్పటం వలన భయపడాలి కానీ, నిజం చెప్పటం వలన భయం ఎందుకు అనుకుంటూ ఉండేదాన్ని. దాని వల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఎదురయ్యాయి. అయితే నాన్నగారు ఒకసారి హైదరాబాద్ వచ్చినప్పుడు, నాన్నగారు నాకు ఈ వాసన గురించి క్లారిటీ ఇవ్వండి నేను మిమ్మల్ని పైకి అడగను. ఎందుకంటే, నా మనసులో ఉన్నవి అన్నీ మీరు చదివేస్తున్నారు. నా మైండ్ మీకు ఓపెన్ బుక్ కదా! అనుకొని నాకు దీని గురించి మీరు చెప్పాలి అనుకుంటూ ఆ రోజు నాన్నగారి దగ్గరకి వెళ్ళాను. ఆ రోజు నాన్నగారు ప్రవచనంలో ఇలా చెప్పారు.

"ప్రపంచంలో ఎక్కువ తగులుకోకూడదు. ప్రపంచం అంత మంచిది కాదు. మీరు మాట్లాడేది నిజమైనా సరే మాట్లాడవద్దు. యేసు ఎవరిని చంపలేదు, ఏ పాపము చేయలేదు. "I and my father one" అన్నాడు. అది absolute truth అయినప్పటికీ, ఉదయం శిలువ వేసి రాత్రి వరకు కొట్టి, కొట్టి చంపారు. మీరు ఈ ప్రపంచంలోకి వచ్చిన పని ఏమిటంటే, మరలా ఈ ప్రపంచంలోకి రాకుండా చూసుకోండి. ఈ ప్రపంచము అనిత్యము, దుఃఖాలయం. అయినా మనం ఈ ప్రపంచంలోకి వచ్చేసాము. మనము ఏమీ చేయాలి అంటే, కృష్ణుడు నన్ను భజించండి, నా పాదాలను ఆశ్రయించండి, మీరు ఏమైనా మాటలు చెప్పుకుంటే నా గురించి చెప్పుకోండి అని చెప్పాడు కదా! అందుచేత మీరు ఒక చేతితో నన్ను పట్టుకొని, మరో చేతితో మీ సంసారంలో ఉన్న పనులను చూసుకోండి. మీ పనులు పూర్తయ్యాక రెండు చేతులతో నన్నే పట్టుకోండి. ప్రపంచంలో స్థిరమైన వస్తువుని పట్టుకుంటే పడిపోరమ్మా! చిన్నపిల్లలు రెండు చేతులు చాచి తిరుగుతూ ఉంటే కళ్ళు తిరిగి కిందకి పడిపోతారు. కానీ ఒక స్ధంభాన్ని పట్టుకుని తిరిగితే ఎంతసేపు తిరిగినా కిందపడరు. అలాగే ఈ ప్రపంచంలో స్థిరమైన భగవంతుడిని పట్టుకుంటే మీరు ఈ ప్రపంచంలో పడిపోకుండా ఉంటారు. అలా ఈ ప్రపంచంలో అన్ని వేళలా నిజాలు మాట్లాడకుండా, మీరు వచ్చిన పని మీరు చూసుకుంటూ వెళ్ళిపోండి. ఈ లోకంలో అందరిని మార్చాలని అనుకోవద్దు. ఈ ప్రపంచలో చాలా ముళ్ళు ఉంటాయి. ముల్లుకి, మల్లుకి మధ్యలో అడుగులు వేసుకుంటూ మీ గమ్యమైన మోక్షాన్ని చేరుకోండి. ఈ ప్రపంచం నీది కాదు, నాది కాదు. అది ఈశ్వరుడిది! అది ఆయన చూసుకుంటారు" అని చెప్పారు.

ఆ మాటలు వినగానే నేను పైకి చెప్పకపోయినా నాన్నగారు నా మనసులోకి తొంగి చూసి నా సందేహాన్ని నివృత్తి చేశారు. నా మనస్సు నాన్నగారికి తెరిచిన పుస్తకం అనిపించింది.

ఒకసారి నాన్నగారు వచ్చినప్పుడు Jubilee Hills లక్ష్మి గారి ఇంటికి వెళ్ళాము. నేను వెళ్ళగానే నాన్నగారు నన్ను చూసి అమ్మా సౌగంధిక! ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోమ్మా, మరలా రేపురామ్మా! అన్నారు. నాన్నగారు ఆ మాట అనేసరికి ఏంటి ఇప్పుడు వెళ్ళిపోమంటున్నారు అనుకొని వెంటనే బయలుదేరి తొందరగా ఇంటికి చేరుకున్నాను. నేను చేరుకునేసరికి ఇంటిలో పాలు మాడిపోయి ఉన్నాయి. మేము ఎప్పుడైనా బయటికి వెళితే మా ఇంటి తాళాలు కింద వేరేవారికి అప్పజెప్పి వెళ్తాము. అలా తాళాలు వారి దగ్గరే ఉన్నప్పటికీ వారు గ్యాస్ ఆఫ్ చేయలేదు. మేము వచ్చిన తర్వాత చూసుకుంటామని అనుకున్నారట. అయినప్పటికీ నాకు వారి మీద ఎటువంటి కోపం రాలేదు. ఎందుకంటే నేను ఒక సినిమాకి వెళితే ఇంటిదగ్గర పాలు మాడిపోయాయి, గ్యాస్ బంద్ చెయ్యి అని నాకు ఎవరు చెప్పరు. కానీ నేను వెళ్ళింది ఒక సద్గురువు దగ్గరికి కాబట్టి నా ఇంట్లో ఏమి జరుగుతుందో, నా జీవితంలో ఏమి జరుగుతుందో అన్నీ ఆయనకు తెలుసు అనుకున్నాను. ఇంకొకసారి నాన్నగారు నాకు ఇలా చెప్పారు. "భక్తి అనేది మనం రహస్యంగా ఉంచుకోవాలమ్మా సౌగంధికా, అది నీకు భగవంతుడికి మాత్రమే చెంది ఉండాలమ్మా" అన్నారు .

నాన్నగారు తరచూ సాత్వికాహారం గురించి చెబుతూ ఉండేవారు కదా! అది విని ఆచరించాలి అనుకుని మాంసాహారం ముట్టకూడదు అనుకున్నాను. ఒకసారి ఏదో శుభకార్యం నిమిత్తం స్నేహితులతో కలిసి ఆ కార్యక్రమానికి వెళ్ళాను. అక్కడ ఒక వైపు శాకాహార విందు, మరోవైపు మాంసాహార విందు ఏర్పాటు చేశారు. మాంసాహారం చూడగానే తినాలి అనిపించింది కానీ తినకూడదు అనుకున్నాను. కాబట్టి శాకాహారం వైపు వెళుతుంటే మా స్నేహితురాలు ఈ ఒక్క రోజుకి తినండి అని అన్నారు. నాకు కూడా మనసులో తినాలి అనే కోరిక ఉంది కాబట్టి ఆమె వంపు పెట్టుకుని ఆ రోజు మాంసాహారం తిన్నాను. మరుసటి రోజు నాన్నగారి దగ్గరకు వెళ్ళాను. ఆరోజు నాన్నగారు మీరు ఏదైనా శుభకార్యాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఎవరో బలవంతం చేశారని మాంసాహారం తింటారు. కానీ లోపల మీకు తినాలి అనే వాంఛ ఉంది కాబట్టి దానిని తింటున్నారు. అది కూడా ఒక వాసనే. ఆ వాసనలు అన్నీ నాశనం అయితే గాని మీరు ఆత్మ లో స్థిరపడరు అని చెప్పి. "ఒక ఏనుగు గోతిలో పడిపోతే దానిని వందమంది బయటకు లాగుదాము అనుకున్నా లాగలేరు. అదే ఏనుగు ఒక నదీ ప్రవాహంలో పడిపోతే అలా కొట్టుకుపోతుంది. అలాగే మీకు ఎన్ని వాసనలు ఉన్నా గురువు అనుగ్రహంలో పడితే, ఆ అనుగ్రహ ప్రవాహంలో వాసనలన్నీ కొట్టుకుపోతాయి" అన్నారు. అది విన్న తర్వాత నాన్నగారంటే సామాన్యుడు కాదు. మనం ఏమి చేసినా నాన్నగారికి తెలిసిపోతోంది. బహు జాగ్రత్తగా ఉండాలి అనిపించింది. నాలో ఎన్ని వాసనలు ఉన్నా నాన్నగారికి అవి తీయటం అసాధ్యం కాదు అనేది నా విశ్వాసం.

నాకు హార్ట్ లో హోల్ ఉందని ఆపరేషన్ చేయించాలని మా అమ్మాయి అమెరికా నుండి వచ్చింది. ఆపరేషన్ కి ముందు ఇద్దరం కలిసి జిన్నూరు వెళ్ళాము. నాన్నగారు మా అమ్మాయిని చూసి ఆపరేషన్ చేయించటానికి అమెరికా నుండి వచ్చినందుకు థాంక్స్ అమ్మ అని చెప్పారు. అలా నాన్నగారు నా గురించి మా అమ్మాయికి థాంక్స్ చెప్పటం చూసి నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఒక రోజు మా అమ్మాయి నాన్నగారికి ఫోన్ చేసింది. అప్పుడు నాన్నగారు మా అమ్మాయిని, నువ్వు ఎన్ని రోజులు ఉంటావమ్మా ఇక్కడ? అని అడిగారు. 20 రోజులు సెలవులు పెట్టుకున్నాను నాన్నగారు అని చెప్పింది. నువ్వు రేపు బయలుదేరి అమెరికా వెళ్ళిపోమ్మా ఉండవద్దు! అన్నారు. ఫోన్ పెట్టేసిన తర్వాత అదేమిటి నాకు సెలవులు ఉన్నాయి కదా! ఉంటాను అంటే నాన్నగారు ఇలా అంటున్నారు ఏంటి అని అంది. నాన్నగారు వెళ్ళిపో మన్నారు కదా వెళ్ళిపో ఎందుకు వెళ్ళిపోమన్నారో నీకు ఇప్పుడు తెలియదు తర్వాత తెలుస్తుంది అన్నాను. తను వెంటనే బయలుదేరి వెళ్ళిపోయింది. ఆఫీస్ కి వెళ్ళేసరికి ఈరోజు మీరు రాకపోయి ఉంటే మిమ్మల్ని ఇక్కడ నుండి తొలగించేవారు అన్నారట. మా అమ్మాయి నాకు ఫోన్ చేసి ఆశ్చర్యపోయింది. ఆశ్చర్యం ఏమీలేదమ్మ నాన్నగారు త్రికాలజ్ఞులు, సర్వాంతర్యామి ఆయనకి అన్నీ తెలుసు అని చెప్పాను. అంటే ఒకవైపు మన ఆరోగ్యాలను రక్షిస్తూ, మరోవైపు మన ఉద్యోగాలను కాపాడుతూ అన్నీ ఆయనే చూసుకుంటున్నారు.

ఆపరేషన్ అయిన తర్వాత నేను కొంచెం నీరసించాను. నాన్నగారు నన్ను చూసి ఏంటమ్మా ఇలా అయిపోయావు అన్నం సరిపడినంత తింటున్నావా? ఒక్కసారి ఆస్పత్రిలో చూపించుకో అని చెప్పారు. నాతో ఇలా ప్రేమగా మాట్లాడుతూ ఆయన నన్ను కట్టిపడేసారు. ఒకసారి కాశీ వెళ్ళాము అక్కడ నాన్నగారు ప్రవచనం అయిన తర్వాత బుద్ధుడి విగ్రహాలు చూస్తున్నారు. నాన్నగారికి నాకు మధ్యలో చాలామంది ఉన్నారు. అప్పుడు నా మనస్సులో నాన్నగారు ఇంత మందిని దాటుకొని మీ దగ్గరకి రాలేను. మీ చేత్తో ఒక బుద్ధుడి విగ్రహం ఇస్తే బాగుంటుంది అని ఒక ఆలోచన వచ్చింది. కానీ తరువాత మర్చిపోయాను. మరుసటి రోజు ఎవరో ఒక భక్తురాలు నాన్నగారికి బుద్ధుడి విగ్రహం తీసుకుని వచ్చి ఇచ్చారు. ఆ బుద్ధుడు విగ్రహన్ని అమ్మా సౌగంధిక ఇలారా అని పిలిచి నాకు ఇచ్చారు. మన లోపల ఏమి అనుకుంటున్నామో అవిఅన్నీ నాన్నగారికి తెలిసిపోతున్నాయి. తలంపుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అనిపించింది. ఒకసారి నాన్నగారు నాకు B12 టాబ్లెట్ ఇచ్చి సౌగంధిక నీవు జీవించి ఉన్నంత వరకూ ఈ టాబ్లెట్ వేసుకో అని చెప్పారు. అప్పుడు నాకు నాన్నగారు Spiritual doctor and Physical doctor also అనిపించింది.

నా భర్తకి స్నేహితులు చాలా ఎక్కువ. అందులో ఒకరు అత్యంత సన్నిహితులు. ఆయన ఒక రోజు మా ఇంటికి వచ్చారు ఆయన వచ్చేసరికి నేను ఇంట్లోలేను. ఎక్కడికి వెళ్లారు అని నా గురించి మావారిని అడిగారు. తను వాళ్ళ గురువుగారి దగ్గరికి వెళ్ళింది అని చెప్పారు. అలా గురువుల దగ్గరికి పంపించవద్దు, బయట పరిస్థితితులు బాగా లేవు అని మా వారికి ఆయన చెప్పారు. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నా స్నేహితుడు ఇలా అంటున్నారు అని నాకు చెప్తే అవును మీరు అన్నది కరెక్టే చాలామంది గురువులు అలాగే ఉన్నారు. కానీ నాన్నగారు లాంటి గురువుని ఆయన చూడలేదు కదా! అలాంటి మాటలు మీరు పట్టించుకోవద్దు అని చెప్పాను. ఈ సంఘటన జరిగిన రెండు సంవత్సరాల తరువాత ఆయనకి ఒక వ్యక్తిగత సమస్య వచ్చింది దానివలన ఆయనకి చాలా టెన్షన్, బీపి ఎక్కువ అయిపోయాయి. ఆ సమయంలో ఆ సమస్యని మా వారితో పంచుకోవటానికి మా ఇంట్లో ఉన్న ల్యాండ్ లైన్ కి ఫోన్ చేశారు. అనుకోకుండా నేను ఆ ఫోన్ ఎత్తి మాట్లాడాను. ఆరోజు ఆయన చాలా టెన్షన్ గా ఉండటం వల్ల ఆయన పడుతున్న ఇబ్బంది అంతా నాతో పంచుకున్నారు. అది విని అక్కడే ఉన్న నాన్నగారు ఫోటో చూస్తూ నాన్నగారు ఈయన మనసు శాంతపడేటట్టు ఏదైనా నాలుగు వాక్యాలు నాతో చెప్పించండి అనుకొని ఆయనకు చెప్పాను. అయన అదంతా విన్న తర్వాత నాకు టెన్షన్ తగ్గిందమ్మా! అని చెప్పి ఫోన్ పెట్టేసారు. తరువాత మావారి స్నేహితులందరికీ కూడా కిషన్ గారి భార్య ఒక మంచి గురువు దగ్గరకు వెళ్తున్నారు. ఏదైనా సమస్య ఉంటే ఆమెకు ఫోన్ చేస్తే మనకి టెన్షన్ తగ్గుతుంది అని చెప్పారు. అలా చెప్పటమే కాకుండా ఆయన కూడా హైదరాబాద్ లో నాన్నగారికి సంబంధించి జరిగిన కార్యక్రమాలు అన్నిటికీ హాజరయ్యేవారు.

నాన్నగారు నన్ను తెలంగాణ టీచర్ అని పిలిచేవారు. అంటే నువ్వు తెలంగాణలో ఉన్నావని నిన్ను తెలంగాణ టీచర్ అని పిలవటంలేదు. నేను చాలా మంది తెలంగాణ వాసులని మీరు ఏ సత్సంగానికి వెళ్తున్నారు? అని అడిగాను. వారందరూ సౌగంధిక సత్సంగం అని చెప్పారు. అంతమంది తెలంగాణ వాసులు ఇక్కడికి రావటం అనేది అసాధ్యం. వారందరూ నీ దగ్గరికి వస్తున్నారు కాబట్టి నిన్ను తెలంగాణ టీచర్ అంటున్నానమ్మ అన్నారు.

నాన్నగారు భక్తి మార్గం గురించి గాని, విచారణ మార్గం గురించి గానీ చెబుతూ, చిన్న,చిన్న ఉదాహరణలతో వివరించటం వలన ఆచరించాలి అనే బుద్ధి కలుగుతుంది. పక్షులకు వల వేసే వాడు ఆహారాన్ని ఎరగా పెట్టి వల వేస్తాడు. అవి తెలియక వచ్చి ఆహారాన్ని తిని ఆ వలలో చిక్కుకుపోతాయి. అలాగే నాన్నగారు ఆయన ప్రేమ, దయ అనే వలలో చిక్కుకునేటట్టు చేసి, మన మనసుకు స్వతంత్రం లేకుండా చేసి, మన హృదయంలో ఉన్న స్వతంత్రమైన సుఖాన్ని మనకి అందించటం కోసం ఆయన బోధించారు.

ఒకసారి ఒక భక్తురాలు నాన్నగారి వద్దకు వచ్చి నాన్నగారు మా అబ్బాయి పదో తరగతి ఫెయిల్ అయ్యాడు. చదవడు, ఇంట్లో ఏ పనీ చేయడు అని చెప్పి, మీరే ఏదో విధంగా ఒక దారి చూపించాలి అని విన్నవించుకున్నారు. మరుసటి రోజు ఒక భక్తుడు వచ్చి నాన్నగారూ ఒక ఫ్యాక్టరీ పెడుతున్నాను, దాని ప్రారంభోత్సవానికి మీరు రావాలి అని ఆహ్వానించారు. అప్పుడు నాన్నగారు మీరు ఉద్యోగాలు ఇస్తారా మాకు? అని అడిగారు. ఎవరైనా ఉంటే పంపించండి నాన్నగారూ ఇస్తాను అని చెప్పారు. ఈ పదో తరగతి ఫెయిల్ అయిన అబ్బాయిని పంపించి ఉద్యోగం ఇమ్మన్నారు. ఒక సంవత్సరం అయిన తరువాత ఆ కంపెనీ ఓనర్ వచ్చి నాన్నగారు మీరు పెట్టిన అబ్బాయి అసలు పని చేయడు, చేసే వాళ్ళను కూడా చెయ్యనివ్వడు. మీకు ఒక మాట చెప్పి అతనిని తీసేద్దాం అనుకుంటున్నాను అన్నారు. దానికి నాన్నగారు మీకు కొబ్బరి చెట్లు ఉన్నాయా అని అడిగి, ఆ కొబ్బరి తోటలో మీరు ఎరువు అన్ని చెట్లుకి సమానంగా వేసినా అన్ని చెట్లు సమానంగా కాయవు కదా! కాయలేని చెట్లను తొలగిస్తారా అని అడిగారు. లేదు నాన్నగారు అలా చేయను అని చెప్పారు. అలాగే ఈ అబ్బాయిని కూడా మీ దగ్గర ఉంచండి. నెమ్మదిగా వాడే నేర్చుకొని మారుతాడు అని చెప్పారు. ఈ మాటలు వినగానే నాన్నగారికి ఎంత దయో కదా అనిపించింది. మనకి ఏ సమస్యలు ఉన్నా ఆయన దగ్గర ఉంచితే అవి తొలగిపోవలిసిందే.

నాన్నగారు సర్వదేవతా స్వరూపులు. ఎవరి గురించి చెప్పినా వారి స్వరూపంలో జీవిస్తూ చెప్పేవారు. నాన్నగారిని ఎప్పుడు చూసినా నా మనసుకి శాంతి లభించేది. అంటే అలా నా మనసు అరెస్ట్ అయిపోయేది. ఆయన ఎవరితో మాట్లాడినా నాతో మాట్లాడినట్టే ఆనందపడుతూ ఉండేదాన్ని. అలా ఇరవై మూడు సంవత్సరాలు ఆయన కురిపించిన ప్రేమలో తడిసి ముద్ద అయిపోయాను. ఈరోజు నాతో ఎవరు మాట్లాడినా, మాట్లాడకపోయినా నాకు ఏమీ అనిపించదు. నా కప్పు మొత్తం నాన్నగారు నింపేశారు అనిపిస్తుంది. నేను జీవించి ఉన్నంతవరకు సరిపోయే ప్రేమను ఆయన నాకు పంచారు. ఇప్పుడు నా మనసులో ఎలాంటి వెలితి లేదు. మానవజన్మ వచ్చినందుకు నాకు అర్హత లేకపోయినప్పటికీ, అతి సమర్థుడైన గురువు లభించాడు అనిపిస్తుంటుంది. నాన్నగారు అంటే సామాన్యులు కారు. ఆయన ఆధ్యాత్మిక వీరుడు (Spiritual Hercules).