Sunday, September 15, 2019

“నిజమైన ఆప్తుడు గురువే” - (By విజయ గారు)


మా ఇంట్లో, దగ్గర బంధువు ఒకరు పోవటంతో అందరూ దుఃఖంగా ఉన్న సమయంలో శ్రీ నాన్నగారు సఖినేటిపల్లి గీతామందిరం వస్తున్నట్లు తెలిసి, వారి దర్శనానికి వెళ్లాను.అలా వారితో పరిచయం ఏర్పడింది. ఆ తరువాత వారి ప్రసంగాలు ఎక్కడ జరిగినా వెల్తూండేదాన్ని.

సఖినేటిపల్లి నుండి మాకు హైదరాబాదు ట్రాంస్ఫరు అయ్యింది. నాన్నగారిని ఒదిలి చాలా దూరంగా వెళ్లిపోతున్నందుకు చాలా దుఃఖం వచ్చింది. “నాన్నగారూ! మీకు దూరంగా వెళ్లిపోతున్నాను. మీతో ఏదైనా చెప్పుకోవాలంటే ఇప్పటిలా కుదర్దు. ఏం చెయ్యను?” అని బాధగా అడిగాను. “నా ఫోటో ఉందామ్మా నీ దగ్గర?- దానితో చెప్పుకోమ్మా” అన్నారు. ఇన్నాళ్లూ ఫోటో అంటే ఒక కాగితం మాత్రమే అనుకున్నాను, కానీ నాన్నగారు ఇలా చెప్తున్నారంటే నాన్నగారు నా దగ్గరే ఉన్నారన్నమాట. నాన్నగారి ఫోటో నాన్నగారే!!! వారు చెప్పిన మాటలు గురువంటే ఏంటో తెలియజేసాయి. అంతే! ఆ రోజు నుంది ఏ సమస్య వచ్చినా, అసలు ఫొటో దగ్గర కూడా వెళ్లకుండానే లోపల నుండి గైడెంస్ వచ్చేది. ఎంత బరువైన సమస్య అయినా తేలికగా అనిపించేది. “నీకు సజీవమైన విశ్వాసం ఉంటే నిన్ను నీ నిజ గురువు దగ్గరకు తీసుకెళుతుంది” అన్న నాన్నగారి మాట నన్ను నడిపిస్తుంది.


“నిజమైన ఆప్తుడు గురువే” ఇది మాటగా మనకు అర్థమౌవచ్చు. కాక పోవచ్చు. కాని అనుభవ పూర్వకంగా గ్రహించినపుడు అందులోని నిజం మన గుండెను తాకుతుంది. అలా నా జీవితంలో జరిగిన సంఘటన-

ఆ రోజు షాపింగ్ వెళ్లి ఇంటికి వచ్చాను. ఇంటి చుట్టూ జనం వున్నారు. చుట్టు పక్కల వాళ్లందరూ ఏడుస్తున్నారు. నాకు అర్థం కాలేదు. ముందుకు వెళ్లేసరికి నా భర్త శవం కనిపించింది. గుండె చిక్కబట్టుకున్నాను. ఆయనకు కొద్దిగా అనారోగ్యం ఉంది. కాని హఠాత్తుగా చనిపోయే అంతటి సుస్తీ లేదు. ఆయన దగ్గరకు వెళ్లలేదు. వెంటనే నాన్నగారి ఫోటో దగ్గరికి వెళ్లాను. “ఏంటి నాన్నగారూ!” అన్నాను. “ఈశ్వర సంకల్పాన్ని కాదంటావామ్మా!” అని లోపల నుండి గైడెంస్ వచ్చింది. నిజమే- కాని జీవితంలో అతి ముఖ్యమైన బంధం తెగిపోయింది – ఎన్నో సంవత్సరాలు కలిసి జీవించాం. కష్టంలోనూ, సుఖంలోనూ తోడుగా నిలిచారు. ఒక్క సారి ఆ సంఘటనలన్నీ కళ్ల ముందు మెదుల్తున్నాయి. దుఃఖం వస్తోంది. శవం దగ్గరకు వెళ్లి ఏడుస్తూంటే-“ జీవుడు లేడు కదా. కట్టె కోసమా నువ్వు విలపించేది? మనం దుఃఖిస్తే ఆ జీవుడికి అశాంతి కలుగజేసిన వారమౌతాము. మనం శాంతిగా ఉంటే ఆ శాంతి జీవుడు ఎక్కడున్నా అందుతుంది.” అని నాన్నగారు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. భర్త చనిపోయాడని దుఃఖపడాలా? జీవుడు శాంతిగా ఉండాలని బాధ పడకుండా ఉండాలా? లోపల సంఘర్షణ. మళ్లీ నాన్నగారి ఫోటో దగ్గరకు వెళ్లాను. ఎదురుగా నాన్నగారి ప్రవచన పుస్తకం ఉంది. ఒక పేజీ తిరగవేసే సరికి “ నువ్వు నిమిత్త మాత్రంగా ఉండు” అన్న వాక్యం కనబడింది. అపుడు నాన్నగారి కళ్లలోకి అలా చూస్తూ ఉండిపోయాను. బయట పరిస్థితి దుఃఖంగా ఉంది. కాని నా లోపల నుండి నాకు చలించని ధైర్యాన్నిచ్చి శాంతిగా నన్ను నిలబెట్టిన ఆప్తుడు నా గురువు కాక మరెవరు. ఆయన అనుగ్రహం లేక పోయి ఉంటే మా శాశ్వత ఎడబాటుకి నేను ఏమైపోయి ఉండేదాన్నో!


ఈ సంఘటన జరగడానికి పది రోజుల ముందు నుండి నాన్నగారు నా పై చూపించిన ప్రేమ, కరుణ ఒక్క సారి నా కళ్ల ముందు కదిలాయి. పది రోజుల్లో భర్త పోతాడన్న సంగతి నా ఊహకు అందని విషయం. కాని గురువుకు తెలియని విషయమేముంటుంది. అంటే నాకు మానసికంగా శక్తినివ్వటానికి ఆ తండ్రి కురిపించిన ప్రేమని సంఘటన జరిగాక గుర్తించగలిగాను.

ఆ రోజు నుండి ఈ రోజు వరకు సాధ్యమైనంత వరకు వారి సన్నిధి లో గడిపేటట్లుగా నన్ను అనుగ్రహించిన కరుణామూర్తి నాన్నగారు. “నా మాటలను మీరు కాదనగలరేమో గాని నా అనుభవాన్ని కాదనలేరు కదా!”

Saturday, September 14, 2019

"నాన్నగారు - శాంతి సముద్రం" - (By రామచంద్రరాజు గారు (వడ్లవానిపాలెం))


అది ఒకనాటి సాయంకాలము. సద్గురువు శ్రీ నాన్నగారిని చూడాలని జిన్నూరు వారింటికి వెళ్లాను. ఆ సమయంలో ఆయన ఒక్కరే అరుగు మీద కుర్చిలో నిర్మలంగా, ఏకాంతంగా కూర్చుని ఉన్నారు. ఆయన నన్ను చూసి కూర్చోమన్నారు. నా యోగక్షేమాలన్నీ అడిగి తెలుసుకున్నారు.అలా మొదటి దర్శనంతోనే హృదయానందంతో రాత్రి మా ఇంటికి వెళ్లాను. ఆ రోజు నుండి శ్రీ నాన్నగారిని చూడటానికి రోజూ వారింటికి వెళ్లివస్తూండేవాడిని. నాకు రోజూ భక్తి, కర్మ, జ్నాన, వైరాగ్యాలను సమన్వయం చేస్తూ బోధిస్తూ ఉండే వారు. భగవాన్ శ్రీ రమణ మహర్షి గురుంచి, అరుణాచల వైభవం గురించి తరచూ తెలియజేస్తూండేవారు. నాకు భగవదనుభవం పొందాలనే కాంక్ష కలిగింది. శ్రీ నాన్నగారితో సహవాసం వలన నా జీవితం మలుపు తిరిగింది.

శ్రీ నాన్నగారి దర్శన భాగ్యం వలన, ఆయన సన్నిధి మాత్రం చేత, ఆయన బోధల వల్ల నేను మా ఇంటికి వెళ్లినా, ఏ పని చేస్తున్నా, నిద్రిస్తున్నా, నిరంతరం నా స్మృతిలో ఉంటూ, నాలో ఉంటూ, నన్ను నడిపిస్తున్నట్లుగా ఉండేది. నా హృదయాంతరాలలో నుండి ఒక తెలియరాని ఆత్మానందం వెల్లుబికి వచ్చేది. ఈ ఆనందం, ఈ వైభవం ఏమిటని నన్ను నేనే నమ్మలేక పోయేవాడిని. అలా ఆయనను చూసినంత మాత్రాన, ఆయన ప్రవచానాలు విన్నంత మాత్రాన ఆయనతో ఉన్న సన్నిహిత సహచర్యం వల్ల- ఆనందం, శాంతి, కాంతి, సత్యం,ప్రేమ నా స్వంతమై నా అనుభవంలో శాశ్వతమైతే ఇంక ఎంత బాగుంటుందోనని, అంతకంటే సాధించేది లేదనిపించింది. ఆయన చూపులో, వాక్కులో ఎంతో ప్రేమానురాగాలు పొంగివచ్చి నా హృదయంతరాలలో ప్రవేశించి నన్ను అంతర్ముఖపరిచేవి.

మానవతా విలువలు క్షీణిస్తున్న ఈ కాలంలో జాతిని జాగృతం చెయటానికి సద్గురు నాన్నగారు జ్ఞాన నిధిగా శాంతిని ప్రజలకు అందించాలనే మహత్తర ఆశయంతో మన మధ్య నిలిచారు. మానవుడిని దుఃఖం లేని స్థితికి తీసుకుని వెళ్లటమే సద్గురు శ్రీ నాన్నగారి ప్రవచనములలోని ముఖ్య ఉద్దేశ్యం. ఇతరుల నుండి ఆయన కోరుకునేది వారి సుఖ శాంతులు మాత్రమే. శ్రీ నాన్నగారిలో నిగూఢంగా దాగి ఉన్న అంతర్వాహిని శక్తి దివ్యానుభూతులను కల్గించి, శాంతి తీరాలలో మనస్సును లగ్నం చెయటమే ఆయన సన్నిధిలో జరిగే గొప్ప విషయం. ఇది మహర్షులకు, మహాత్ములకు, జ్ఞానులకు మాత్రమే సాధ్యం. 


తండ్రిగా, తల్లిగా, పసిపాపగా, యజమానిగా, ఆచార్యునిగా, మిత్రునిగా సద్గురు శ్రీ నాన్నగారు మన ముందు సంచరిస్తూ, ఒక మానవ దేహంగా గోచరిస్తున్నారు. హృదయగుహలో ఉన్న అంతరాత్మ యొక్క సజీవ ఆవిష్కృతి యైన సద్గురు శ్రీ నాన్నను దర్శించినచో విశ్వాత్మ ఒక అమూల్యమైన నిధిగా మనకు అందుబాటులో ఉన్నదని గ్రహించగలము.

ఆకలి పోగొట్టే అన్నదాత కంటే అజ్ఞానం పోగొట్టే జ్ఞాన దాత శ్రేష్టుడు. ఇది శ్రీ నాన్నగారు చెసే జ్ఞాన యజ్ఞాల ప్రధాన ధ్యేయం. తనకున్న శక్తులన్నీ సమాజ కల్యాణానికి ఉపయోగించాలనే తపన మాత్రమే శ్రీ నాన్నగారి ప్రబోధాలలో మనకు అర్థమవుతుంది.

ఋషులు వేద మంత్రాలను దర్శించినట్లే సద్గురు శ్రీ నాన్నగారు తాను పొందిన ఆత్మానుభూతికి ప్రేమని జోడించి అన్ని వర్గాల వారికి, వారి అమృత వాక్కులుగా వినిపిస్తున్నారు. ఆ వాక్కులు విని నేడు భక్తులు ఎంతో సుఖంగా జీవించగలుగుతున్నారు. వినేవారి గ్రహణశక్తిని అనుసరించి మహార్థములు స్ఫురిస్తూంటాయి.

తొలత శ్రీ నాన్నగారి “అమృతవాక్కులు” శ్రవణం చేసిన వారు, చదివిన వారు ఎంతో ప్రభావితులై, వేదాంతాన్ని, ఉపనిషత్తుల సారాన్నంతా సులభ శైలిలో అందరికీ అర్థమైయ్యేటట్లు బోధించే మహాత్ముని దర్శించటానికి సుదూరమైన ప్రాంతాల నుండి వచ్చి ఆనందపరవశులైనారు.
శ్రీ నాన్నగారు సన్నిధి మాత్రం చేతనే భక్తులను పునీతులను చేయగల స్థిత ప్రజ్ఞులు.
ప్రతిఒక్కరు స్వేచ్ఛగా, స్వతంత్రంగా, వివేకంగా జీవించాలని, చైతన్య వంతుల్లవ్వాలని తనలో దాగి ఉన్న అంతర్వాహినియైన శక్తిని సుఖస్వరూపాన్ని తెలుసుకొని అందరూ అమృతమూర్తులు కావాలనే తపనతో వారు నిరంతరం, నిర్విరామంగా జ్ఞానయజ్ఞాలు చేస్తూ, కృషి చేస్తున్నారు. అంతేగాని తన ఆశ్రితులందరూ ఏ దేవునికో, రమణ మహర్షికో, తనకో అవివేకంగా మూఢభక్తులు కావాలని శ్రీ నాన్నగారి ధ్యేయం కాదు. ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలో సద్గురు శ్రీ నాన్నగారి ప్రబోధలు సువర్ణాక్షరాలతో లిఖింపబడతాయి.

Friday, September 13, 2019

"Our Nanna's guidance in every step" - (By Satish Garu)

The golden moments spent in Nannagaru's presence

Physically, I have had to go through a lot of hardships; Hardships in the profession, financial hardships, and so on. Despite the hardship, being with Nannagaru in this period of 15 years kept me peaceful in the heart. When in Jinnuru, I was distraught many times in his presence. He would ask me to sit resting against the pillar and that he would speak to me later. He would wait till my mind cooled down and only then he would talk to me. Later, I went to Kuwait for job purpose. But due to some visa problems, I had to come back. The very next day, I went to Arunachalam. Usha Akka (Dr. Usha) reported to Nannagaru that I had to return from Kuwait due to a visa problem. He started talking about the royals of Kuwait as though he was not bothered by what happened to me there. I found his response very surprising. I understood later that though the circumstances seem important to us, to the Jnani it is just a play.

After returning from Kuwait, I was jobless for a year. Every alternate day, I used to visit Nannagaru in Jinnuru. I started feeling intimate with Nannagaru. The peace in the heart was fine, but I had to do some work to earn a living too. I expressed this to Usha Akka. She said to me, “Satish! This is a golden period in your life. You are free now and making the best use of your time. You may become very busy later in life and not be able to come to Jinnuru as frequently.” It is exactly because of this free time that I was able to stay by his side during the last 15 days before his physical departure. Had I been in Kuwait, this would have never been possible!

During the last days, when Nannagaru was confined to bed, I stayed there even at night time. On one particular day, Nannagaru was moaning in pain all night. He had not slept even for half an hour. In that state, I did not expect that he would recognize me. I was sitting by his side. He asked me, “Is the Satsang in Malkipuram going on smoothly?” For a year before this, I had started going every Saturday from Bheemavaram to Malkipuram for conducting the Satsang. Once Nannagaru’s health started deteriorating, I started going to Jinnuru every day, thereby Satsang was not conducted. Even when he was so unwell, he asked about the Satsang. When I told him that I was coming to Jinnuru instead, he said, “If it wasn’t possible for you, you should have asked Amalapuram Master Garu to conduct the Satsang. Isn’t it?” It surprised me that he pinpointed and asked me about the Satsang in that state of health. That gave me an insight into the importance of Satsang. 4-5 months after Nannagaru left the physical frame, I moved to Malkipuram as I started a business there. Satsang in Malkipuram is going on very well. Not only in regularity, but also the subject we are discussing. We are able to feel grace in all aspects.

Giving up me and mine sense is real renunciation (tyaga)

Nannagaru used to attend some school functions of Saraswati Sishu Mandir of Lakkavaram. He also gave donations regularly to this school as they taught the children with great interest. The school children were also taught Ramayana and Mahabharata. I too had my primary education in this school. This helped me in my spiritual understanding and progress. I liked Shirdi Saibaba a lot. I used to feel the want of a Guru of that kind, so that I may offer my services. Even as a child, I used to feel that I must offer my services to great souls. I feel Nannagaru gave me this opportunity of serving him in his last days because of my strong desire. After this, my mind stopped going outward (extrovert). As I was getting all the guidance from inside, I never felt any disturbance in my spirituality. After Nannagaru left his mortal frame, his presence has become even more evident. I can see Nannagaru in all devotees. In fact, it began to feel that all jivas are his projections. And I no more felt the need to visit Jinnuru. I had a strong urge to visit him every fortnight previously. Now, I do not miss Jinnuru.

What I have understood is that what Nannagaru referred to as tyaga (renunciation) is not leaving something of ours, but leaving the very sense of me and mine. That means he is asking us to handover unto him, our very false existence. I think that is the greatest teaching.

He pulled me near and gave the closeness

The problem I faced, in the beginning, was that while Nannagaru made himself easily accessible by being in Jinnuru, so close to hometown; and made himself easily approachable as a father, I seemed to be more interested in Arunachalam, Bhagavan’s form and Bhagavan’s teaching felt like the best and ultimate teaching. Whenever I looked at devotees gathered in Jinnuru, I used to appreciate their devotion, attention, and interest in looking at Nannagaru’s form. One must possess a love for the Guru’s form too isn’t it? I had great respect for him but did not feel love towards him in my heart. How can I have love towards Bhagavan who cannot be seen now, and have no love towards Nannagaru whom I see daily, I wondered. I felt very bad about this. After 3-4 years, when I felt the closeness with Nannagaru, I understood that while the forms of Nannagaru and Bhagavan are different, the presence is the same. So, from then on I had no suffering in this issue.

I was able to grasp his silence. Sometimes, when I asked a doubt, he would answer looking into my eyes. No sooner he starts to talk, I would be swallowed by peace, not hear a thing but remain doubt free. Which means doubt would get erased and replaced by a higher state. Even without any kind of effort from our side, Nannagaru placed us in such an exalted state! Nannagaru always gave the example of Malayamaarutam (the cool breeze from Nilgiri hills). He always said that when such a cool breeze is blowing naturally, one does not need to use the hand-fan. Finally what I gathered is that all that ultimate knowledge that Bhagavan imparted, Nannagaru naturally got us habituated to it, without our knowledge.

Initially when I heard ‘You are not this body, you are not this mind’, I got scared. If I am not these two, then I must be something, and I do not know what that is I thought. I went through considerable suffering because of this. So, I have been living all these days without knowing who I really am? I wondered. As a child I used to think about where I came from; never believed in the existence of heaven and hell, despite being told about them. I never knew whom to ask then.

To place at his feet this ego and mind filled with its attributes is the real sadhana (effort). Once in Kashi, Nannagaru remarked, “I am doing great sadhana; so saying do not decorate your ego. Throw that ego away and then do the real sadhana.”

Finally, how can anyone describe Guru’s grace in words? When all that has happened, is happening and will happen is seen as his play, watching the whole universe as projections from him and let this ego dissolve in him alone, is what we can offer as Guru Dakshina (remuneration).

Thursday, September 12, 2019

"చెయ్యి పట్టి నడిపిన మన నాన్న" - (By సతీష్ గారు)

నాన్నగారు సమక్షంలో గడిపిన బంగారు క్షణాలు

భౌతికమైన కష్టాలు చాలా పడ్డాను. వృత్తిపరంగా , ఆర్థికంగా చాలా కష్టాలు పడినా నాన్న గారితో పాటు ప్రయాణించిన ఈ పదిహేను సంవత్సరాల కాలంలో ఆయన ఉండటంవల్ల, నాకు భౌతికమైన కష్టాలు వచ్చినా, లోపల నాకున్న శాంతి ఎప్పుడు చెదరలేదు. భౌతికంగా కష్టాలలో ఉన్నప్పుడు జున్నూరులో ఆయన దగ్గర కూర్చుని చాలా ఆవేదన గా ఉండేవాడిని. నేను ఏమీ మాట్లాడలేని స్థితిలో ఉన్నప్పుడు, నువ్వు ప్రశాంతంగా స్తంభానికి జారబడి కూర్చో. తర్వాత నీతో మాట్లాడుతాను అని చెప్పి, నేను ప్రశాంతంగా అయ్యాకానే నాతో ఏదైనా చెప్పేవారు. తరువాత నేను Kuwait కి వెళ్ళాను, కానీ వీసా ఇబ్బంది వల్ల వచ్చేశాను. మరుసటి రోజు అరుణాచలం వచ్చాను. అప్పుడు అక్కడ ఉష అక్క నాన్నగారితో, వీసా ప్రాబ్లెం వల్ల సతీష్ వచ్చేసాడు అని అంటే , ఆయన ఇవి ఏమీ పట్టనట్టు ఎంతో సరదాగా ఆయన కువైట్ రాజు గురించి మాట్లాడుతున్నారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇదేమిటి కష్టపడి ఎక్కడెక్కడో తిరిగి వచ్చాము, ఇప్పుడు నా గురించి చెప్పకుండా కువైట్ రాజు గురించి వాళ్ళతో మాట్లాడుతున్నారు ఏంటి అనుకున్నాను. నాకు అప్పుడు అర్ధం కాలేదు. కాని తర్వాత రాను,రాను అర్ధమయ్యింది. మనకి ఏదైనా కష్టం వస్తే, అది చాలా పెద్దదిగా కనిపించవచ్చు కాని జ్ఞానికి ఇదంతా తీసేసిన సినిమానే కదా!

నేను ఇక్కడకు వచ్చేసిన తర్వాత భౌతికంగా ఇబ్బందులు ఉన్నా కానీ ఆ తరువాత ఒక సంవత్సరం నేను ఖాళీగా ఉన్నాను. రోజు విడిచి రోజు జిన్నూరు వెళ్ళేవాడిని. ఆయన సన్నిధి ఎక్కువ ఉపయోగించుకున్నాను. అలా రోజు నేను నాన్నగారి దగ్గరికి వెళ్ళటం వలన నాన్నగారికి చాలా దగ్గర అయ్యాను. లోపల శాంతి గా ఉన్నా భౌతికంగా కూడా బ్రతకాలి కదా! ఇలా రోజు వచ్చి వెళ్ళిపోతున్నాను అని ఉష అక్కతో అంటే అప్పుడు అక్క ఒక మాట చెప్పారు అదేమిటంటే : "సతీష్ ఇది గోల్డెన్ పిరియడ్, ఆయన అవకాశం ఇచ్చారు కాబట్టి నువ్వు దగ్గర ఉన్నావు. నువ్వు బిజీ అయిపోయి, ఆయన దగ్గరకు రాకుండా ఉండే రోజులు కూడా వస్తాయి అన్నారు." తరువాత అదే జరిగింది. అప్పుడు చాలాసార్లు రాలేకపోయినా ఉష అక్క మాటే గుర్తొచ్చేది. నాన్నగారి ఆఖరి రోజులలో ఒక 15 రోజులు ఆయన దేహం ఉన్నప్పుడు ఆయన దగ్గర ఉండగలిగాను కదా! అదే నేను వేరే దేశంలో ఉండి ఉంటే నాకు వీలుపడేది కాదు.

ఆఖరి రోజులలో నాన్న గారు మంచం మీద ఉన్నప్పుడు రాత్రుళ్లు కూడా అక్కడే గడిపేవాళ్ళము. ఒక రోజు రాత్రి ఆయన ఒక అరగంట కూడా పడుకోలేదు. చాలా బాధపడుతూ ఉన్నారు. అలాంటి సమయంలో నన్ను గుర్తు పడతారు అని కూడా నేను అనుకోలేదు. నేను నాన్నగారి పక్కనే కూర్చున్నాను. అప్పుడు ఏమన్నారంటే , మల్కిపురంలో సత్సంగం జరుగుతుందా అని అడిగారు. అప్పటికే ఒక సంవత్సరం ముందు నుండి ప్రతి శనివారం భీమవరం నుండి మల్కిపురం వెళ్లి అక్కడ గుడి దగ్గర సత్సంగం చెప్పుకునేవాళ్ళం . నాన్నగారికి ఆరోగ్యం బాగోలేనప్పుడు నుంచి భీమవరం నుండి జిన్నూరు వచ్చేవాడిని, మల్కిపురం వెళ్ళే వాడిని కాదు. అయితే నాన్నగారు అంత అనారోగ్యంగా ఉన్న ఆ సమయంలో కుడా మల్కిపురంలో సత్సంగం జరుగుతుందా అని అడిగారు. నేను వెళ్ళటం లేదు నాన్నగారు మీ దగ్గరకే వస్తున్నాను అని చెప్పాను. నీకు వీలు అవ్వకపోతే అమలాపురం మాస్టర్ని వెళ్లమని అడగవచ్చు కదా అన్నారు. అప్పుడు నాకు అనిపించింది ఇంత ఇబ్బంది లో కూడా ప్రత్యేకించి ఆయన సత్సంగానికి అంత ప్రాముఖ్యతను ఇచ్చారు కదా అని నాకే బాధ అనిపించింది. చిన్న దాన్ని కూడా ఆయన అంత పిన్ పాయింట్ గా చెప్పటం నాకు ఆశ్చర్యమేసింది. నాన్నగారు దేహం వదిలేసిన నాలుగైదు నెలలు తర్వాత భీమవరంలో ఉద్యోగం మానేసి మల్కిపురం వచ్చేసాను ఏదో వ్యాపారం గురించి. గత సంవత్సరం నుంచి కూడా సత్సంగం చాలా బాగా జరుగుతోంది. నాన్నగారి అనుగ్రహం వలన సబ్జెక్టు మేము బాగా చెప్పుకోగలుగుతున్నాము. అంత అనుగ్రహం ఎలా కురిపిస్తున్నారో మాకే అర్ధం అవ్వటం లేదు.

నీలో ఉన్న అహంకారము, మమకారములను విడిచిపెట్టటమే త్యాగం

నాన్నగారు లక్కవరంలో ఉన్న సరస్వతి శిశు మందిరం స్కూల్ కి వచ్చేవారు. అక్కడ నాన్నగారి టీచింగ్ చెప్పేవారు. నాన్నగారు వారికి డొనేషన్స్ కూడా ఇచ్చేవారు. నేను చిన్నప్పుడు ప్రైమరీ ఆ స్కూల్లో చదువుకున్నాను. ఆ స్కూల్లో ఫస్ట్ సెకండ్ క్లాస్ నుంచి రామాయణం, మహాభారతం నేర్పుతారు. అలా నేర్పటం వలన అవి నాకు చిన్నప్పుడే కొంతవరకు అవగాహన ఉంది. నాకు షిరిడి బాబా అంటే ఇష్టం ఉండేది. అప్పట్లో ఎలా ఉండేది అంటే, మనం సేవ చేసుకోవటానికి బాబా లాంటి గురువు లేడు కదా అని అనిపిస్తూ ఉండేది. సత్పురుషుల దగ్గర ఉండాలి వారి సేవ చేసుకోవాలి అనే వాసన చిన్నప్పుడు నుంచి ఉంది. ఆ కోరిక నాన్నగారు నాకు ఆఖరి రోజులలో తీర్చేరు అని అనిపించింది. అప్పటి నుండి మనస్సు బాహ్యానికి వెళ్ళటం తగ్గింది. నిరంతరం నాన్నగారు గైడెన్స్ లోపల నుండి ఇవ్వటం వలన లోపల అశాంతి గాని ,వెలితిగాని లేదు. నాన్నగారు దేహం వదిలిన తర్వాత ఇప్పుడు అందరిలోను నాన్నే కనిపిస్తున్నారు. ఆయన ఉనికి ఇప్పుడు ఇంకా ఎక్కువ తెలుస్తోంది. జీవుడి రూపంలోనూ ఆయనే ఉన్నారు అనే భావన దృఢ పడిపోవటం వలన జిన్నూరు వెళ్ళినా, వెళ్లకపోయినా నాకు బాధ కలగటం లేదు. ఇంతకుముందు 15 రోజులకు ఒకసారైనా వెళ్లాలి అనిపించేది. ఇప్పుడు వెలితి ఉండటం లేదు. నాకు అర్థమైంది ఏమిటంటే నాన్నగారు ఎక్కడో సత్సంగంలో త్యాగం గురించి చెప్పారు.త్యాగం అంటే ఏదో ఒకటి వదిలేయటం కాదు నిన్ను నీవు వదులుకోవడమే త్యాగం అన్నారు. అంటే మన false existence ని ఆయనకి అప్పగించేస్తే మనం త్యాగి అవుతాము. ఎంత అద్భుతమైన టీచింగ్ అని అనిపిస్తుంది.

నాకు చనువు ఇచ్చి, దగ్గరికి తీసుకున్నది నాన్నగారే

ఈ ప్రయాణంలో మొదట్లో నాకున్న ఇబ్బంది ఏమిటంటే నాన్నగారు మనకి జిన్నూరు లో దొరికేసారు కదా. మన అందరికి ఒక తండ్రిలా ఉండేవారు ఆయన, నాకు మాత్రం భగవాన్ అన్నా, భగవాన్ టీచింగ్ అన్న అల్టిమేట్గా అనిపించేది. నాన్నగారి దగ్గరకు వచ్చిన కొత్తలో అందరూ అరుగు మీద కూర్చుని నాన్నగారు ఏం చెప్పినా శ్రద్ధగా విని, ప్రేమగా ఉండేవారు. నాకు చిన్నప్పుడు ఏమనిపించేదంటే వీళ్ళు అందరూ గురువు పట్ల ఇంత ప్రేమగా ఉన్నారు. భౌతికమైన గురువు పట్ల ప్రేమ ఉండాలి కదా నాకు నాన్నగారంటే గౌరవం ఉంది కానీ ప్రేమ రావటం లేదు ఏంటి. కనిపించని భగవాన్ మీద తెలియని అనుబంధం ఉంది కనిపించే నాన్నగారి మీద ప్రేమ రావటం లేదు ఏంటి అని చాలా బాధపడే వాడిని. ఒక మూడు నాలుగు సంవత్సరాలు తరువాత నాన్నగారి దగ్గర భయం తగ్గి చేరువయ్యాను. అప్పుడు భగవాన్, నాన్నగారు వేరు కాదు. వారి రూపాలు వేరు కాని, వారి ఉనికి ఒక్కటే అని నాకు అర్ధమైనది. అప్పటి నుండి నాకు సఫరింగ్ లేదు.

నాకు ఆయన మౌనం అందేది. కొన్ని సార్లు ఏమైనా సందేహం వచ్చినప్పుడు అడగలేక అడిగితే ఆయన కళ్ళల్లోకి చూసి చెప్పేవారు. ఆయన చెప్పటం మొదలు పెట్టిన మరుక్షణం మనస్సు అణిగిపోయేది . ఆయన ఏమి చెప్పారో తెలిసేది కాదు కానీ ఆయన కళ్ళల్లో అనుగ్రహం ఆ సైలెన్స్ మాత్రం నా హృదయానికి పట్టేసేది. అంటే సంశయం నశించి, ఉన్నస్థితి అర్థం అయ్యేది. మనం ఏమీ కష్టపడక పోయినా మనల్ని ఏ స్థాయిలో కూర్చోపెట్టారు అనేది ఇప్పుడు అర్థమవుతోంది. నాన్నగారు మలయమారుతం అనేవారు. సహజంగా గాలి వీస్తున్నప్పుడు నీకు విసినకర్ర తో పని ఏమిటి అనే వారు కదా. చివరికి ఏమిటంటే భగవాన్ చెప్పే టీచింగ్ లో సారమంతా కూడా నాన్నగారు మనకి తెలియకుండానే అలవాటు చేసేసారు అనిపిస్తోంది. 

మొదట్లో నాన్నగారు మీటింగులు వింటున్నప్పుడు దేహం నువ్వు కాదు, మనస్సు నువ్వు కాదు అంటుంటే నాకు భయం వేసేది. అప్పట్లో నేను ఇది కాదన్నప్పుడు నేనేంటో నాకు తెలియటం లేదు కదా నేను దేహం కాదన్నప్పుడు నేనేమిటో అది నేను అవ్వాలి కదా అని చాలా సఫరింగ్ పడ్డాను. అంటే నేను ఎవరో తెలియకుండా ఇలా బతికేసేనా ఇంతకాలం అనిపించేది. చిన్నపుడు స్కూల్ కి వెళ్ళేటపుడు అనిపించేది నేను అసలు ఎక్కడ నుంచి ఇక్కడికి వచ్చాను. కానీ అప్పుడు ఎవరిని అడగాలో తెలిసేది కాదు. స్వర్గం,నరకం అనేవి ఉన్నాయి అని ఎవరైనా చెప్పినా కూడా అవి ఉన్నాయి అని ఏ మాత్రం నమ్మకం కలిగేది కాదు .

మన అహంకారాన్ని, మన స్వభావాన్నిగురు పాదాల దగ్గర అర్పణ చేసుకోవటం మాత్రమే మనకు గతి. నాన్నగారు ఒకసారి కాశి లో ఇలా అన్నారు. "మేము సాధన చేస్తున్నాము అని మీ భుజాన మీ నేనుని వేసుకుని తిరుగుతున్నారు ఇంక సాధన ఏమిటి .మీ నేనుని ఒక పక్కన పడేసి, అప్పుడు చేయండి సాధన" అని.

చివరిగా, గురు వైభవం ఇట్టిది అని మాటల్లో ఎలా చెప్పగలం. జరిగింది , జరుగుతున్నది ,జరగబోయేది అయన లీల మాత్రమే అయినప్పుడు మనకి, మన ఉనికికి ఇంకా చోటేది ,అయన లీలా ప్రవాహంలో సాక్షీ మాత్రంగా ఈ సృష్టిని అయన ప్రతిరూపంగా చూస్తూ మనం కరిగిపోవటం మాత్రమే మన గురువుకి మనం ఇవ్వవలసిన గురు దక్షిణ .

"సత్యజ్ఞానం లేని ఈ జన్మఫలమేమి ఒప్పగా రావేల అరుణాచల"

శ్రీ నాన్న పరమాత్మనే నమః

Tuesday, March 12, 2019

"PANCHLOHA VIGRAHA AAVISHKARANA" - Live From 6Am to 10Am on 13th March

Om SRI NANNA PARAMAATHMANEY NAMAHA

Dear NANNA Devotees,


    "PANCHLOHA VIGRAHA AAVISHKARANA"

Of Our NANNAGARU will Be Telecasted Live From 6Am to 10Am in the Below link
   
  Press the ( ▶ ) play Button

Kindly Utilize This Wonderful Opportunity Given By NANNAGARU to The Couldn't Attend The "GURU KRIPA VAIBHAVAM"

OM SRI NANNAAYA NAMAHA.

PLEASE USE THIS  WONDERFUL OPPORTUNITY GIVEN BY SRI NANNAGARU TO ALL THE DEVOTEES WHO COULDN'T ATTEND PHYSICALLY

Sadguru Sri Nannagari Vigraha Prathishta - Day 2 - March 12th, 2019 at Jinnur Sri Ramana Kshetram.


Gouvu chupu 🙏, cow will be the first to see Sri Nannagaru's vigraham before vigraha pooja